నా సమయం అదానీ-అంబానీల కంటే విలువైనది: బాబా రామ్‌దేవ్ 

Published : Feb 20, 2023, 01:00 AM IST
నా సమయం అదానీ-అంబానీల కంటే విలువైనది: బాబా రామ్‌దేవ్ 

సారాంశం

అదానీ, అంబానీ, టాటా, బిర్లా కంటే తన సమయం విలువైనదనీ, కార్పొరేట్లు తమ స్వప్రయోజనాల కోసం 99 శాతం సమయాన్ని వెచ్చిస్తారనీ, అయితే సన్యాసుల సమయం సాధారణ ప్రయోజనాల కోసమేనని యోగా గురు రామ్‌దేవ్  అన్నారు  

కార్పొరేట్‌ సంస్థలు తమ స్వప్రయోజనాల కోసం 99 శాతం సమయాన్ని వెచ్చిస్తున్నాయని, అయితే సన్యాసి సమయం అందరి మేలు కోసమేనని యోగా గురు రామ్‌దేవ్ ఆదివారం అన్నారు. అంబానీ, అదానీ వంటి బిలియనీర్ పారిశ్రామికవేత్తలు గడిపిన సమయం కంటే తాను ఇక్కడ ఉన్న మూడు రోజులు చాలా ఉపయోగకరంగా మరియు విలువైనదని ఆయన అన్నారు. తన సహోద్యోగి ఆచార్య బాలకృష్ణ సన్మాన కార్యక్రమంలో రామ్‌దేవ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కూడా పాల్గొన్నారు.

తాను హరిద్వార్ నుండి ఇక్కడకు వచ్చి మూడు రోజులైంది అని చెప్పాడు. అదానీ, అంబానీ, టాటా, బిర్లా కంటే నా సమయం విలువైనది. కార్పొరేట్లు తమ స్వప్రయోజనాల కోసం 99 శాతం సమయాన్ని వెచ్చిస్తారు, అయితే సన్యాసుల సమయం సాధారణ ప్రయోజనాల కోసమేనని అన్నారు. బాలకృష్ణ తన వృత్తిపరమైన పాలన, పారదర్శక నిర్వహణ, జవాబుదారీతనం కారణంగా నష్టాల్లో ఉన్న పతంజలిని ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.40,000 కోట్ల టర్నోవర్ సంస్థగా మార్చారని కొనియాడారు. పతంజలి లాంటి సామ్రాజ్యాన్ని నిర్మించి ముందుకు తీసుకెళ్లడం ద్వారా భారతదేశాన్ని 'అల్టిమేట్ గ్లోరియస్'గా మార్చాలనే కలను సాకారం చేసుకోవచ్చని అన్నారు.

ఇదిలా ఉంటే.. అక్బర్, బాబర్, ఔరంగజేబులు మన హీరోలు కాదనీ.. ఛత్రపతి శివాజీ మహరాజ్ మన హీరో అని యోగా గురు బాబా రామ్‌దేవ్ అన్నారు. దక్షిణ గోవాలోని పోండా జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని గోవా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్ ముఖ్య అతిథిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

  'పుస్తకాలలో మొఘలుల మహిమ'

బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ.. చాలా రాష్ట్ర బోర్డు లేదా NCERT పుస్తకాలు మనకు తప్పుడు చరిత్రను బోధిస్తున్నాయనీ, ఈ పుస్తకాలలో మొఘల్‌లను కీర్తించడం మారాలని అన్నారు. అక్బర్, బాబర్ లేదా ఔరంగజేబు మన హీరోలు కాదనీ, మన మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ .. దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు.  రామ్‌దేవ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితమే దిగ్విజయంగా నిలిచిందన్నారు. ఈ చరిత్రను మనం తెలుసుకోవాలి. శివాజీ మహారాజ్ ఎప్పుడూ ఏ మతం లేదా వర్గం పట్ల వివక్ష చూపలేదని, అయితే అందరినీ వెంట తీసుకెళ్లేవారని రామ్‌దేవ్ అన్నారు. 

అదే సమయంలో పాకిస్థాన్ సంక్షోభంపై

పాకిస్థాన్ సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ.. ఆ దేశం నాలుగు ముక్కలవుతుందని అన్నారు. ‘పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందని.. త్వరలో పాకిస్థాన్‌ నాలుగు ముక్కలుగా విడిపోనుందని.. చిన్న దేశంగా మిగిలిపోతుందని’ అన్నారు.

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu