షిండే భారీ స్కాం..  రూ. 2000 కోట్ల డీల్.. ఉద్ధవ్ వర్గం సంచలన ఆరోపణలు

Published : Feb 19, 2023, 11:07 PM IST
షిండే భారీ స్కాం..  రూ. 2000 కోట్ల డీల్.. ఉద్ధవ్ వర్గం సంచలన ఆరోపణలు

సారాంశం

మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు కోల్పోయిన ఉద్ధవ్ థాకరే వర్గం.. విమర్శలు ఎక్కుపెడుతోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘంపై భారతీయ జనతా పార్టీపై ఏక్‭నాత్ షిండేపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.   

శివసేన విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్రదుమారం రేగింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తును షిండే వర్గానికి కేటాయించడంపై  పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘంపై, బీజేపీపై, ఏక్‭నాత్ షిండే వర్గంపై  ఠాక్రే వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎన్నికల సంఘం బానిసగా మారిందంటూ.. ఉద్ధవ్ వర్గంలోని సీనియర్ రాజకీయ నేత సంజయ్ రౌత్ మరో తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా.. శివసేన పేరు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగిందని, సుమారు 2,000 వేల కోట్ల రూపాయల డీల్ కుదిరిందని సంచలన ఆరోపించారు. 

శివసేన నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ చేసిన తాజా ప్రకటనతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.  రౌత్ ట్వీట్ చేస్తూ.. “  నా దగ్గర కచ్చితమైన సమాచారం ఉంది. ఇప్పటివరకు శివసేన పేరు, గుర్తు కోసం 2,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. వందకు వంద శాతం ఇది కచ్చితమైన సమాచారం ఉంది. ఇంకా చాలా విషయాలు తొందరలోనే వెల్లడి అవుతాయి. దేశ చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదు." అని పేర్కోన్నారు.  అయితే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శిబిరం నుండి ఎమ్మెల్యే సదా సర్వాంకర్ వాదనను తిరస్కరించారు . “సంజయ్ రౌత్ క్యాషియర్ కాదా?” అంటూ నిలాదీశారు. 

ఇక శనివారం తనకు మద్దతుగా ఉద్ధవ్ నివాసానికి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే పాల్గొన్నారు. గత ఏడాది పార్టీ ఫిరాయించిన 40 మంది ఎమ్మెల్యేలకు, భారీ గందరగోళం మధ్య, పాలన మార్పు ఫలితంగా ఒక్కొక్కరికి ₹ 50 కోట్లు ఇచ్చామని చెప్పారు. త్వరలో అనేక విషయాలు వెల్లడి కానున్నాయి. దేశ చరిత్రలో ఇది మునుపెన్నడూ జరగలేదని పేర్కొన్నారు.

ఉద్ధవ్ ఠాక్రే వర్గమే నిజమైన శివసేన అని మిస్టర్ రౌత్ వాదిస్తూ, ఆయన పార్టీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరో ట్వీట్‌లో, ఎన్నికల కమిషన్ ఆదేశాలు 'విశ్వాసాన్ని కలిగించడం లేదు' అని అన్నారు. పాక్షిక న్యాయపరమైన అధికారాలు కలిగిన రాజ్యాంగ సంస్థ నిష్పక్షపాతంగా ఉండటమే కాకుండా ఏదైనా ప్రభావం నుండి దూరంగా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు ECI ఆర్డర్ విశ్వాసాన్ని కలిగించదని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu