దేశంలోని 55 శాతం సెల్ ఫోన్లు తయారయ్యేది ఎక్కడో తెలుసా?

Published : Dec 25, 2025, 09:38 PM IST
Smart phone

సారాంశం

మొబైల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తిలో ముందుండంతో పాటు అగ్రిటెక్, ఫిన్‌టెక్, డిఫెన్స్, భవిష్యత్ టెక్నాలజీలలో ఉత్తర ప్రదేశ్ వేగంగా దూసుకెళ్తోందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

Lucknow : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో ఉత్తరప్రదేశ్ ఈరోజు దేశంలోనే టాప్ అచీవర్ రాష్ట్రంగా నిలిచిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి దిశగా సాధించిన ప్రగతి, దేశంలోని అగ్రగామి రాష్ట్రాల సరసన నిలబెట్టిందన్నారు.

ఉత్పత్తి, పెట్టుబడులు, ఆవిష్కరణలలో కొత్త గుర్తింపు

ఉత్తరప్రదేశ్ ఇప్పుడు కేవలం అధిక జనాభా ఉన్న రాష్ట్రం మాత్రమే కాదు… ఉత్పత్తి, పెట్టుబడులు, ఆవిష్కరణలకు పెద్ద కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో తయారయ్యే మొత్తం మొబైల్ ఫోన్లలో దాదాపు 55 శాతం ఉత్తరప్రదేశ్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని ఆయన తెలిపారు. అలాగే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల మొత్తం ఉత్పత్తిలో దాదాపు 60 శాతం వాటా కూడా రాష్ట్రంలోనే తయారవుతోందన్నారు.

పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఫలితం

ఈ మార్పు ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక విధానాలు, బలమైన పరిపాలనా వ్యవస్థ, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం ఫలితమేనని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఉత్తరప్రదేశ్‌ను టాప్ అచీవర్‌గా ప్రకటించడం, ప్రభుత్వం పరిశ్రమలకు నమ్మకమైన వ్యవస్థను ఏర్పాటు చేసిందనడానికి నిదర్శనమన్నారు.

సింగిల్ విండో సిస్టమ్‌తో పెరిగిన పెట్టుబడులు

పరిశ్రమల కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్, సకాలంలో అనుమతులు, పారదర్శక ప్రక్రియలను అమలు చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సంస్కరణలతో పెట్టుబడిదారుల నమ్మకం బలపడి, పెద్ద ఎత్తున దేశీయ, విదేశీ పెట్టుబడులు ఉత్తరప్రదేశ్‌ వైపు ఆకర్షితమయ్యాయన్నారు యోగి ఆదిత్యనాథ్.

విద్య, నైపుణ్యం, స్టార్టప్‌లతో యువతకు అవకాశం

జాతీయ విద్యా విధానం, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి పథకాలను రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేశామని సీఎం యోగి అన్నారు. దీనివల్ల యువతకు ఆధునిక నైపుణ్యాలు అంది, ఉపాధి, స్వయం ఉపాధికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయన్నారు.

భవిష్యత్ టెక్నాలజీ 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి భవిష్యత్ రంగాలలో ఉత్తరప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ రంగాలలో పెట్టుబడులు, ఆవిష్కరణలతో రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యం నిరంతరం బలపడుతోందన్నారు

అగ్రిటెక్ నుండి డిఫెన్స్, స్పోర్ట్స్ రంగాల వరకు విస్తరణ

అగ్రిటెక్, ఫిన్‌టెక్, డీప్‌టెక్, హెల్త్‌టెక్, టూరిజం, హాస్పిటాలిటీ, డిఫెన్స్, మాన్యుఫ్యాక్చరింగ్, స్పోర్ట్స్ రంగాలలో కూడా రాష్ట్రం కొత్త శిఖరాలను అందుకుందని సీఎం యోగి అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగాలతో ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధిలో కొత్త శిఖరాల వైపు పయనిస్తోందని సీఎం యోగి పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tenant Rights : మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా..? అయితే మీ హక్కులేంటో తప్పకుండా తెలుసుకొండి
PM Celebrates Christmas at Cathedral Church: క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ | Asianet News Telugu