భార్యాభర్తల మధ్య గొడవ: నాలుక కోసుకొన్న భర్త

By narsimha lodeFirst Published Mar 15, 2021, 8:42 PM IST
Highlights

తరచూ గొడవ పడే భార్యతో వేగలేక విసుగు చెంది నాలుక కోసుకొన్నాడు. ఈ  ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. రాష్ట్రంలోని కాన్పూరు జిల్లా గోపాల్‌పూర్ గ్రామంలో నిషా.. ముకేష్ లు భార్యభర్తలు. 

లక్నో: తరచూ గొడవ పడే భార్యతో వేగలేక విసుగు చెంది నాలుక కోసుకొన్నాడు. ఈ  ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. రాష్ట్రంలోని కాన్పూరు జిల్లా గోపాల్‌పూర్ గ్రామంలో నిషా.. ముకేష్ లు భార్యభర్తలు. 

ముకేష్ వ్యవసాయం చేస్తాడు. అయితే భార్య కొన్ని రోజులుగా  భర్తతో గొడవపడుతోంది. భార్యాభర్తల మధ్య విబేధాలు పెరిగిపోయాయి.  దీంతో నిషా పుట్టింటికి వెళ్లింది. అయితే శనివారం నాడు ముకేష్ భార్యకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచాడు.

 ఇంటికి వచ్చిన తర్వాత కూడ నిషా భర్తతో గొడవకు దిగింది. కలిసి జీవిద్దామని భర్త ఎంతగా బతిమిలాడినా ఆమె పట్టించుకోలేదు. దీంతో  విసుగు చెందిన ముకేష్ బ్లేడ్ తో తన నాలుక కోసుకొన్నాడు. 

నాలుక తెగి తీవ్రంగా రక్తస్రావమైంది. ఈ గాయాన్ని తట్టుకోలేక ఆయన కేకలు వేయడంతో కుటుంబసభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

click me!