రాజస్థాన్ ఎన్నికలు: ఓటేసిన కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్

Published : Dec 07, 2018, 10:11 AM ISTUpdated : Dec 07, 2018, 10:15 AM IST
రాజస్థాన్ ఎన్నికలు: ఓటేసిన కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్

సారాంశం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జైపూర్‌ వైశాలి నగర్‌లోని బూత్ నెం. 252లో రాథోడ్ ఓటు వేశారు. 

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జైపూర్‌ వైశాలి నగర్‌లోని బూత్ నెం. 252లో రాథోడ్ ఓటు వేశారు.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 200 స్థానాలనున్న రాజస్థాన్‌ శాసనసభలో... రామ్‌గఢ్ బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేశారు.

మిగిలిన 199 అసెంబ్లీ స్థానాల్లో 2,274 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా... వీరిలో 189 మంది మహిళలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తొలిసారిగా మహిళల కోసం 200 పింక్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?