రాజస్థాన్‌లో ప్రారంభమైన పోలింగ్

By sivanagaprasad kodatiFirst Published Dec 7, 2018, 8:24 AM IST
Highlights

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఇవాళ తెలంగాణతో పాటు రాజస్థాన్‌లోనూ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఇవాళ తెలంగాణతో పాటు రాజస్థాన్‌లోనూ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 200 స్థానాలనున్న రాజస్థాన్‌ శాసనసభలో... రామ్‌గఢ్ బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేశారు.

మిగిలిన 199 అసెంబ్లీ స్థానాల్లో 2,274 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా... వీరిలో 189 మంది మహిళలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

click me!