బైక్ ను ఢీకొట్టిన కేంద్రమంత్రి వాహనం.. ఒకరు మృతి, ముగ్గురు చిన్నారులకు గాయాలు

Published : Nov 08, 2023, 02:42 AM IST
 బైక్ ను ఢీకొట్టిన కేంద్రమంత్రి వాహనం.. ఒకరు మృతి, ముగ్గురు చిన్నారులకు గాయాలు

సారాంశం

Prahlad Patel: కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ వాహనం బైక్ ను ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఉపాధ్యాయుడు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చింద్వారా జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ తృటిలో ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నారు. ఆయ‌న‌కు స్వల్ప గాయాలయ్యాయి.  

Prahlad Patel Car Accident: మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రయాణిస్తున్న వాహనం మోటార్ సైకిల్ ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ప్రహ్లాద్ పటేల్ చింద్వారా నుంచి నర్సింగ్ పూర్ వెళ్తుండగా ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి 'వివేక్' బంటి షాహుకు మద్దతుగా ప్రచారం చేయడానికి పటేల్ చింద్వారాకు వచ్చారు.

రోడ్ షోలలో పాల్గొన్న తరువాత బీజేపీ అభ్యర్థి బంటి సాహు కోసం ర్యాలీలలో ప్రసంగించిన తరువాత, కేంద్ర మంత్రి తన సొంత జిల్లా నర్సింగ్ పూర్ కు బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు పిల్లలు దూరంగా పడిపోయారు. ఈ ప్ర‌మాదంలో ధ్వంసమైన మంత్రి వాహనం కూడా రోడ్డుపై నుంచి పొలాల్లోకి దూసుకెళ్లింది. మంత్రి కాళ్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

తన వాహనం నుంచి బయటకు వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాలని అక్క‌డున్న వారిని కోరారు. విష‌యం తెలుసుకున్న స్థానిక పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు అసలు కారణం మోటార్ సైకిల్ ను రాంగ్ సైడ్ లో నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక మంత్రి వాహనం అతివేగం వల్ల జరిగిందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను నాగ్ పూర్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు చింద్వారా ఎస్ డీఎం సుధీర్ జైన్ మీడియాకు తెలిపారు. ఇదిలావుండగా, పటేల్ అధికార మత్తులో ఉన్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించింది. "బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ అతివేగం, అదుపు తప్పిన వాహనం కార‌ణంగా ఒక‌రు చ‌నిపోగా, ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. శివరాజ్ గారూ, మీరు ప్రజలను కీటకాలుగా భావిస్తారా? కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారిని అణచివేస్తున్నారా?" అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

PREV
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu