సరిహద్దుల్లో పాక్ విమానాల చక్కర్లు: రంగంలోకి హోంశాఖ

Siva Kodati |  
Published : Feb 27, 2019, 12:52 PM IST
సరిహద్దుల్లో పాక్ విమానాల చక్కర్లు: రంగంలోకి హోంశాఖ

సారాంశం

హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగతోంది. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో పాటు హోంశాఖ కార్యదర్శి, సైనిక దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగంపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడంతో పాకిస్తాన్ కూడా అందుకు ధీటుగా బదులిస్తామని హెచ్చరించింది. దీనిలో భాగంగా బుధవారం పాక్ వైమానిక దళంలోని రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి భారత భూభూగంలోకి చొరబడ్డాయి.

పూంచ్ , రాజౌరీ సెక్టార్ల పరిధిలోని సుమారు 3 కిలోమీటర్లు ఇవి ముందుకు వచ్చాయి. వీటిని భారత యుద్ధ విమానాలు వెంబడించి నౌషెరా సెక్టార్‌లో కూల్చి వేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది.

హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగతోంది. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో పాటు హోంశాఖ కార్యదర్శి, సైనిక దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu