పాక్ విమానాన్ని కూల్చేసిన ఎయిర్‌ఫోర్స్: తప్పించుకున్న పైలట్

Siva Kodati |  
Published : Feb 27, 2019, 12:33 PM IST
పాక్ విమానాన్ని కూల్చేసిన ఎయిర్‌ఫోర్స్: తప్పించుకున్న పైలట్

సారాంశం

సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాక్ సైన్యం భారత్‌పై ఊగిపోతోంది. ఏదో ఒకటి చేసే వరకు ఆ దేశ సైన్యానికి నిద్ర పట్టేలా కనిపించడం లేదు. దీంతో బుధవారం ఉదయం పాక్ వైమానిక దళానికి చెందిన రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి.

సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాక్ సైన్యం భారత్‌పై ఊగిపోతోంది. ఏదో ఒకటి చేసే వరకు ఆ దేశ సైన్యానికి నిద్ర పట్టేలా కనిపించడం లేదు. దీంతో బుధవారం ఉదయం పాక్ వైమానిక దళానికి చెందిన రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి.

నియంత్రణ రేఖను దాటి సుమారు 3 కిలోమీటర్లు చొచ్చుకువచ్చాయి. పాక్ నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని ముందే ఊహించిన ఎయిర్‌ఫోర్స్ వాటిని వెంటాడాయి. ఈ క్రమంలో లాంబ్ వ్యాలీలో పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేశాయి.

భారత గగనతలంలోకి ప్రవేశించినందునే ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. పాక్‌కు చెందిన పైలట్ ప్యారాచూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి తప్పించుకుని పారిపోయినట్లు సైన్యం తెలిపింది. 

 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu