కేంద్ర బడ్జెట్ 2019 : కేసీఆర్ తరహా రైతు బంధు పథకం

Published : Feb 01, 2019, 11:38 AM IST
కేంద్ర బడ్జెట్ 2019   : కేసీఆర్ తరహా రైతు బంధు పథకం

సారాంశం

తెలంగాణ సీఎం  కేసీఆర్ ప్రవేశ పెట్టిన  రైతుబంధు పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడ రైతులకు వ్యవసాయం చేసేందుకు అవసరమైన పెట్టుబడిని అందించనున్నట్టు ప్రకటించింది.


న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం  కేసీఆర్ ప్రవేశ పెట్టిన  రైతుబంధు పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడ రైతులకు వ్యవసాయం చేసేందుకు అవసరమైన పెట్టుబడిని అందించనున్నట్టు ప్రకటించింది. కేంద్ర్ ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఈ విషయాన్ని  కేంద్రం స్పష్టం చేసింది.  ఐదెకరాలు ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6 వేలను చెల్లించనున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  శుక్రవారం నాడు లోక్‌సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఈ బడ్జెట్‌లో రైతాంగానికి శుభవార్తను అందించారు.  తెలంగాణ సర్కార్ ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం తరహాలోనే కేంద్రం కూడ రైతులకు పెట్టుబడి కోసం  నిధులను అందించనున్నట్టు  ప్రకటించింది. ఎకరానికి రూ.6వేలను పెట్టుబడిగా చెల్లించనుంది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే ఈ పెట్టుబడి సహాయాన్ని అందించనంది.

2018 డిసెంబర్ నుండి ఈ పథకాన్ని అమలు చేస్తామని  పీయూష్ గోయల్ ప్రకటించారు. మూడు విడతల్లో  రైతాంగానికి  సహాయం చేస్తామని కేంద్రం తేల్చి చెప్పింది.దేశంలోని సుమారు 12 కోట్ల మందికి ఈ పథకం ద్వారా  లబ్ది పొందే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించింది. ఈ స్కీమ్‌ను  తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది.

ఏపీ రాష్ట్రం కూడ ఇదే తరహా స్కీమ్‌ను అమలు చేయాలని భావిస్తోంది. తాజాగా కేంద్రం కూడ  ఇదే తరహా స్కీమ్‌ను అమలు చేస్తామని ప్రకటించింది.  
 

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!