మోడీ అధ్యక్షతన ప్రారంభమైన కేంద్ర కేబినెట్ భేటీ.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలతో ప్రాధాన్యత

Siva Kodati |  
Published : Sep 18, 2023, 06:55 PM IST
మోడీ అధ్యక్షతన ప్రారంభమైన కేంద్ర కేబినెట్ భేటీ.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలతో ప్రాధాన్యత

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందించే మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కొత్త బిల్లులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది. ఎజెండాలో పొందుపరిచినవి కాకుండా పలు కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుందనే వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందించే మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !