భద్రతా దళాలకు చిక్కిన టాప్ మోస్ట్ ఉగ్రవాది, లష్కరే తోయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్

Published : Oct 16, 2021, 01:18 PM ISTUpdated : Oct 16, 2021, 01:26 PM IST
భద్రతా దళాలకు చిక్కిన టాప్ మోస్ట్ ఉగ్రవాది, లష్కరే తోయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్

సారాంశం

ఖండే, ఈ ఏడాది ఆగస్టులో హిట్‌లిస్ట్ విడుదల చేసినప్పటి నుండి భద్రతా దళాలు లక్ష్యంగా చేసుకున్న అగ్రశ్రేణి ఉగ్రవాదులలో ఒకరు

లష్కరే తోయిబా కమాండర్ , టాప్ 10 ఉగ్రవాదులలో ఒకరైన ఉమర్ ముస్తాక్ ఖండే పోలీసులకు చిక్కాడు.  పుల్వామా జిల్లాలోని పాంపోర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చిక్కుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం తెలియజేశారు.

ఖండే, ఈ ఏడాది ఆగస్టులో హిట్‌లిస్ట్ విడుదల చేసినప్పటి నుండి భద్రతా దళాలు లక్ష్యంగా చేసుకున్న అగ్రశ్రేణి ఉగ్రవాదులలో ఒకరు. ఈ సంవత్సరం ప్రారంభంలో శ్రీనగర్ జిల్లాలోని బాఘాట్ వద్ద ఇద్దరు పోలీసుల హత్యలో కూడా అతను పాల్గొన్నట్లు అభియోగాలు ఉన్నాయి.

Also Read: ప్రియుడితో ఏకాంతంగా కనిపించిన కూతురు.. ఒళ్లుమండిన తండ్రి చేసిన పని...

"పాఘోర్ శ్రీనగర్‌లో ఇద్దరు పోలీసు సిబ్బందిని చంపడం , పాంపోర్ ఎన్‌కౌంటర్‌లో చిక్కుకున్న ఇతర ఉగ్రవాద నేరాలలో పాల్గొన్న టాప్ 10 ఉగ్రవాదులలో ఉమెర్ ముస్తాక్ ఖండే ఒకరు అని " అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ ద్వారా తెలియజేశారు.

సలీమ్ పర్రే, యూసఫ్ కాంత్రూ, అబ్బాస్ షేక్, రియాజ్ షెటర్‌గుండ్, ఫరూక్ నలి, జుబైర్ వనీ, అష్రఫ్ మొల్వి, సాకిబ్ మంజూర్ , వకీల్ షా లు ఇతర టార్గెట్స్ గా ఉన్నారని  భద్రతా దళాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి-పూంచ్ జిల్లాలోని డెహ్రా కి గాలి (DKG) అటవీ శిఖరం పక్కనే ఉన్న భటా-దురియన్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అక్టోబర్ 14 సాయంత్రం పూంచ్‌లోని మెంధర్‌లోని నార్ ఖాస్ ఫారెస్ట్ ప్రాంతంలో సైన్యం ద్వారా ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ప్రారంభించింది.  ఆపరేషన్ సమయంలో, భారీ కాల్పులు జరిగాయి.ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సిబ్బంది, రైఫిల్‌మన్ విక్రమ్ సింగ్ నేగి మరియు రైఫిల్ మాన్ యోగంబర్ సింగ్ తీవ్రంగా గాయపడి.. ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల ప్రకారం, భీంబర్ గాలి , సూరంకోట్ మధ్య హైవేపై శుక్రవారం వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
అక్టోబర్ 11 న పూంచ్ సెక్టార్‌ని ఆనుకుని ఉన్న రాజౌరీలోని DKG ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (JCO) తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉదయం, J&K DGP దిల్‌బాగ్ సింగ్ కూడా సీనియర్ అధికారులతో సమావేశమై భద్రతా పరిస్థితిని సమీక్షించారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu