Maharashtra: "త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేసినంత మాత్రాన దేశభక్తులైపోరు"

Published : Aug 14, 2022, 05:20 AM IST
Maharashtra: "త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేసినంత మాత్రాన దేశభక్తులైపోరు"

సారాంశం

Maharashtra: బీజేపీ, ఏక్‌నాథ్ షిండే ను శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా విమ‌ర్శించారు.  త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేసినంత మాత్రాన దేశభక్తులైపోర‌నీ, దేశభ‌క్తి ఉన్నట్లు కాదని అన్నారు.

Maharashtra:  త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేసినంత మాత్రాన దేశభక్తులైపోర‌నీ, దేశభ‌క్తి ఉన్నట్లు కాదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే  అన్నారు. అలాగే... బీజేపీ, ఏక్‌నాథ్ షిండేపై విరుచుకుపడ్డారు. శివసేన అనేది బహిరంగంగా పడి ఉన్న వస్తువు కాదని, దానిని ఎవరైనా ఎంచుకొని తన వారసత్వాన్ని పొందవచ్చని ఆయన అన్నారు. 1960లో బాల్ థాకరే స్థాపించిన శివసేన వారపత్రిక 'మార్మిక్' 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ..  శివసేన పునాది లోతైనవ‌నీ, బలమైనవ‌ని అన్నారు. ఆ పార్టీపై ఎవరూ దావా వేయలేరని ఉద్ధవ్ అన్నారు. 

శివసేన నాయకత్వంపై ఠాక్రే, షిండే శిబిరం మధ్య రాజకీయ పోరు సాగుతోంది. షిండే వర్గం కూడా శివసేన ఎన్నికల గుర్తు - విల్లు మరియు బాణాన్ని క్లెయిమ్ చేసింది. ఈ విషయం ఎన్నికల సంఘం ముందు పెండింగ్‌లో ఉంది.

ఈ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ..శివసేన లేకుంటే మహారాష్ట్రలోని మరాఠీ మనువుల పరిస్థితి ఏమై ఉండేదో, దేశంలో హిందుత్వ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాల్సిన విషయమని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 1960లో బాలాసాహెబ్ థాకరే తన మామ, తాతయ్యలతో కలిసి 'మార్మిక్' పత్రికను ప్రారంభించారని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. 

నేడు భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటోంది, కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. మనం బానిస రోజులకు వెళుతున్నామా? అనే సందేహం క‌లుగుతోంద‌ని అన్నారు. ప్రాంతీయ పార్టీలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను ప్రజాస్వామ్యానికి తీవ్రం ముప్పుగా థాకరే అభివర్ణించారు.

దేశ సమాఖ్య నిర్మాణాన్ని ధ్వంసం చేస్తూ ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాక నినాదాలు మిన్నంటుతున్నాయని అన్నారు. జేపీ నడ్డా భాషను పరిశీలించాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యం మరణశయ్యపై పడి ఉందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.  

నేడు భార‌త్ స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వ వేడుక‌లు జరుపుకుంటుంద‌నీ, అయితే రైతులు వరదల్లో చిక్కుకున్న చోటికి ఎంత మంది మంత్రులు, సెంట్రీలు వెళ్తున్నారని ఉద్ధవ్ ఠాక్రే ప్ర‌శ్నించారు. మ‌హారాష్ఠ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి కూడా లేరనీ, రైతుల సమస్యలు ఎవరు పరిష్కరించార‌ని ప్ర‌శ్నించారు. 
  
అగ్నిపథ్ పథకాన్ని ప్రస్తావిస్తూ.. సాయుధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ను తగ్గించాలని కేంద్రం యోచిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికి మీ వద్ద డబ్బు ఉంది, కానీ సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ చేయడానికి లేదా అని ప్ర‌శ్నించారు.

ఇక సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ మార్చ‌డం  గురించి ఉద్ధవ్ మాట్లాడుతూ .. సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా..  త్రివర్ణ పతాకం పెట్టుకోవడం గౌరవమే. కానీ సరిహద్దులో నిలబడి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు నిలువ నీడ లేదనీ,  వారి కోసం బడ్జెట్‭లో కనీస నిధులు కేటాయించలేదని విమ‌ర్శించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu