చెన్నైలో ఇద్దరు రౌడీల ఎన్ కౌంటర్..

Published : Aug 01, 2023, 09:52 AM IST
చెన్నైలో ఇద్దరు రౌడీల ఎన్ కౌంటర్..

సారాంశం

చెన్నైలో ఇద్దరు రౌడీలను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. తనిఖీల సమయంలో కారును ఆపకుండా వెళ్లడమే కాకుండా.. అడ్డగించిన పోలీసులపై కొడవలితో దాడికి దిగారు.

చెన్నై: మంగళవారం తెల్లవారుజామున తమిళనాడు పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు షీటర్ రౌడీలు హతమయ్యారు. తాంబరం సమీపంలోని గుడువంచెరి వద్ద తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పోలీసు సిబ్బందిని నరికి చంపేందుకు ప్రయత్నించిన ఇద్దరు రౌడీలు చోటా వినోద్, రమేష్ హతమయ్యారు.

కరణమోట్టై వద్ద రోడ్డు తనిఖీలో నిమగ్నమై ఉన్న పోలీసు వాహనాన్ని వేగంగా వస్తున్న రౌడీల కారు ఢీకొట్టడంతో ఇదంతా మొదలైంది. "వీరిద్దరు కారు నుండి దిగి నలుగురు పోలీసు సిబ్బందిపై దాడి చేయడం ప్రారంభించారు" అని పోలీసులు తెలిపారు.

కార్లు తనిఖీలు చేస్తుండగా కారు ఆపకుండా రౌడీలు వెళ్ళారు. పోలీసులు కారును వెంబడించి రౌడీలను పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీరిద్దరూ పోలీసుల మీద కత్తులు, కొడవళ్లతో దాడి చేశారు. దీంతో రౌడీలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 

వీరిని చిత్తా వినోద్,  రమేష్ లుగా గుర్తించారు. వీరిలో చిత్తా వినోద్‌పై 10 హత్య కేసులు, దాదాపు 50 కేసులు ఉండగా, రమేష్‌పై ఐదు హత్య కేసులు, మొత్తంగా 30 కేసులు ఉన్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ శివగురునాథన్‌ కు గాయాలయ్యాయి. అతని ఎడమచేతిని కొడవలితో నరికారు. అతను  క్రోమ్‌పేట ప్రభుత్వాసుపత్రిలో చేరారు.

PREV
click me!

Recommended Stories

Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu
ఎవ్వరికీ సాధ్యం కాని మోదీ హిస్టారికల్ రికార్డ్ | Modi Creates History | Asianet News Telugu