సుప్రీంకోర్టు సమీపంలో నిప్పంటించుకున్న ఇద్దరు వ్యక్తులు

Published : Aug 16, 2021, 05:35 PM IST
సుప్రీంకోర్టు సమీపంలో నిప్పంటించుకున్న ఇద్దరు వ్యక్తులు

సారాంశం

సుప్రీంకోర్టు ప్రాంగణం వెలుపల ఇద్దరు వ్యక్తులు ఒక పురుషుడు, ఒక మహిళ నిప్పు అంటించుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు, కొందరు యువకులు వెంటనే మంటలు ఆర్పేసారు. వారిని పోలీసు వ్యాన్‌లో మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. వారిద్దరు నిప్పు అంటించుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ, ఓ పురుషుడు నిప్పంటించుకోవడం కలకలం రేపింది. సుప్రీంకోర్టు గేట్ నెంబర్ డీ ఎదుట సోమవారం మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై నిప్పు ఆర్పారు. బాధితులను రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. వారు నిప్పంటించుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వివరించాలరు.

బాధితులిద్దరు తొలుత సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని ఐడీ కార్డులు అడగ్గా వారు సమర్పించలేకపోయారు. దీంతో ప్రాంగణంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆ గేటు బయటే నిప్పు అంటించుకున్నారు. వెంటనే పోలీసులు బ్లాంకెట్లు, ఇతర వస్త్రాలతో నిప్పు ఆర్పే ప్రయత్నం చేశారు. అక్కడే నిలబడి ఉన్న కొందరు యువకులూ నిప్పు ఆర్పడంలో సహకరించారు. అనంతరం వారిని పోలీసు వ్యాన్‌లో హాస్పిటల్‌కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: పెళ్లి రద్దుకు కారణమైన ప్రీ వెడ్డింగ్ షూట్.. అసలేం జరిగిందంటే.?
Droupadi Murmu Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము| Asianet News Telugu