గుజరాత్ సరిహద్దుల్లో కుప్పకూలిన పాక్ ఎయిర్‌క్రాఫ్ట్: ఇద్దరు పైలట్లు దుర్మరణం

Siva Kodati |  
Published : Apr 13, 2020, 06:39 PM IST
గుజరాత్ సరిహద్దుల్లో కుప్పకూలిన పాక్ ఎయిర్‌క్రాఫ్ట్: ఇద్దరు పైలట్లు దుర్మరణం

సారాంశం

సోమవారం గుజరాత్ రాష్ట్రంలోని భారత్-పాకిస్తాన్‌ సరిహద్దు వద్ద పాక్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. 

సోమవారం గుజరాత్ రాష్ట్రంలోని భారత్-పాకిస్తాన్‌ సరిహద్దు వద్ద పాక్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు.

ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ డే రిహార్సల్స్‌లో భాగంగా ముష్షాక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ బయల్దేరిన కొద్దిసేపటికే గుజరాత్ సరిహద్దుల్లో కుప్పకూలినట్లు చెప్పింది. ఈ ఘటనలో పైలట్లు మేజర్ ఉమేర్, లెఫ్టినెంట్ ఫైజన్‌లు మరణించారు.

కాగా గత నెల 23న పాక్ ఎయిర్‌ఫోర్స్‌కే చెందిన ఎఫ్ 16 విమానం ఇస్లామాబాద్ శివార్లలోని షకర్పరియన్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ విమానం కూడా పాకిస్తాన్ డే రిహార్సల్స్‌లో భాగంగా గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ నౌమాన్ అక్రమ్ దుర్మరణం పాలయ్యారు. వరుస విమాన ప్రమాదాలపై పాకిస్తాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?