Monkey Fever: కర్ణాటకలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మృతి.. ‘48 మందిలో గుర్తించాం’

Published : Feb 05, 2024, 04:47 AM IST
Monkey Fever: కర్ణాటకలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మృతి.. ‘48 మందిలో గుర్తించాం’

సారాంశం

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేగుతున్నది. తాజాగా, ఇద్దరు వ్యక్తులు ఈ మంకీ ఫీవర్ కారణంగా మరణించారు.  

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మరణించారు. శివమొగ్గ జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతి, ఉడిపి జిల్లాకు చెందిన 79 ఏళ్ల వృద్ధుడు ఈ మంకీ ఫీవర్ కారణంగా మరణించారు.  ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు రిపోర్ట్ అయినట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ కమిషనర్ రణదీప్ తెలిపారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2288 శాంపిళ్లను అధికారులు సేకరించారు. ఈ శాంపిళ్లను పరీక్షించగా అందులో 48 మందికి మంకీ ఫీవర్ ఉన్నట్టు గుర్తించారు. మంకీ ఫీవర్ కోతుల నుంచి మనుషులకు సోకుతుంది.

Also Read: Hyderabad: జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లారు.. బిహార్ ఎమ్మెల్యేలు వచ్చారు!

కోతులను కరిచే కీటకాలు మనిషినీ కరిస్తే ఆ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకగానే తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు కనిపిస్తాయని రణదీప్ వివరించారు. ఈ మంకీ ఫీవర్‌కు ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని తెలిపారు. టీకా కోసం ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు
విజయ సంకల్ప యాత్రలో మోదీ స్పీచ్ కి దద్దరిల్లిన సభ | PM Narendra Modi Speech | Asianet News Telugu