బ్రహ్మపుత్ర నదిలో 100 మంది ప్రయాణికులను మోసుకెళ్తున్న రెండు పడవలు ఢీ.. పదుల సంఖ్యలో గల్లంతు

Published : Sep 08, 2021, 05:49 PM IST
బ్రహ్మపుత్ర నదిలో 100 మంది ప్రయాణికులను మోసుకెళ్తున్న రెండు పడవలు ఢీ.. పదుల సంఖ్యలో గల్లంతు

సారాంశం

అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఎదురెదురుగా వెళ్తుండగా ఢీకొట్టుకున్నాయి. సుమారు వంద మంది ప్రయాణికులను మోసుకెళ్తున్న ఈ పడవలు ఢీకొట్టుకోవడంతో పదుల సంఖ్య ప్రయాణికులు నదిలో గల్లంతయ్యారు. 

గువహతి: ఈశాన్య రాష్ట్రం అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో ఎదురెదురుగా వెళ్తున్న రెండు పడవలు ఢీ కొన్నాయి. ఈ రెండు పడవలు కనీసం వంద మందిని మోసుకెళ్తున్నట్టు సమాచారం. పడవలు ఢీకొట్టుకోవడంతో పదుల సంఖ్యలో ప్రయాణికుల నదిలో గల్లంతయ్యారు. అసోంలో జోర్హత్ నగరంలో నిమాతి ఘాట్ సమీపంలో(గువహతికి 350 కిలోమీటర్ల దూరంలో) ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

బ్రహ్మపుత్ర నదిలోని దీవి మజూలీ నుంచి నిమాతి ఘాట్‌వైపు ఒక పడవ వస్తున్నది. కాగా, నిమాతి ఘాట్ వైపు నుంచి మరో పడవ మజూలీకి వెళ్తున్నది. ఈ రెండు ఎదురెదురుగా వెళ్తుండగానే ప్రమాదం జరిగింది. రెండు పడవలు ఢీకొనడంతో చాలా మంది నదిలో మునిగిపోయారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు స్పాట్‌కు చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. 

PREV
click me!

Recommended Stories

పల్లెటూరిలో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు.. దేశంలో తొలిసారి అంతర్జాతీయ కార్డియాక్ కాన్ఫరెన్స్
మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi visits Melbourne Cricket Ground