త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్, వామపక్షాల మధ్య కుదిరిన సయోధ్య.. పోటీ చేసే స్థానాలపై స్పష్టత

Published : Feb 02, 2023, 09:06 AM IST
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్, వామపక్షాల మధ్య కుదిరిన సయోధ్య.. పోటీ చేసే స్థానాలపై స్పష్టత

సారాంశం

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, వామపక్షాల మధ్య సయోధ్య కుదిరింది. రెండు పార్టీలు బుధవారం రాత్రి ఓ ఒప్పందానికి వచ్చాయి. ఒకరు పోటీ చేసే స్థానం నుంచి మరొకరు పోటీ చేయకూడదని, ఆ నామినేషన్లను ఉపసంహరించుకుంటామని ప్రకటించాయి. 

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఈ ఎన్నికల్లో ఒకే స్థానం నుంచి ఒకరిపై ఒకరు దాఖలు చేసిన నామినేషన్ ల ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు.

పంజాబ్ లో పాక్ డ్రోన్స్ కలకలం.. భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం..

త్రిపురలో, సీపీఐ-ఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌, కాంగ్రెస్‌లు ఫిబ్రవరి 16న జరిగే ఎన్నికల కోసం సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా రెండు పార్టీలు తమ అభ్యర్థులను ఉపసంహరించుకుంటాయని బుధవారం ఆలస్యంగా ప్రకటించాయి. సీపీఐ-ఎం నేతృత్వంలోని వామపక్షాలు జనవరి 25వ తేదీన 47 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, తమ కొత్త మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు 13 సీట్లు మిగిలి ఉండగా.. ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తొలగించబడ్డారు. వామపక్షాలు తక్కువ సీట్లు కేటాయించడంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అయితే జనవరి 28న కాంగ్రెస్ 17 మంది అభ్యర్థులను ప్రకటించింది.

ఎయిర్ ఫోర్స్ కొత్త వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమన్‌ప్రీత్ సింగ్ పదవీ బాధ్యతలు..

కాగా.. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన సోమవారం పలు స్థానాల్లో వామపక్షాలు, కాంగ్రెస్‌లు ఒకరిపై మరొకరు అభ్యర్థులను నిలబెట్టాయి. అయితే బుధవారం సీపీఐ-ఎం కాంగ్రెస్ అభ్యర్థులపై పోటీ చేసిన అదనపు అభ్యర్థులను ఉపసంహరించుకుంటామని సీపీఐ-ఎం ప్రకటించింది. అయితే వామపక్ష అభ్యర్థులకు వ్యతిరేకంగా బరిలోకి దిగిన తమ అభ్యర్థులను గురువారం ఉపసంహరించుకుంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ భట్టాచార్య కూడా తరువాత తెలిపారు. 

బడ్జెట్ 2023: 'పేద, నిరుద్యోగ యువతకు ఎలాంటి ప్రయోజనం లేదు': బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి ఆగ్రహం

అయితే నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరి రోజుగా ఉంది. కాంగ్రెస్ నాయకుడు, త్రిపురలో ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే అయిన సుదీప్ రాయ్ బర్మన్ మాట్లాడుతూ.. తాము మొదట 27 సీట్లు డిమాండ్ చేశామని, ఆపై వామపక్షాల నుంచి 23 సీట్లు కోరామని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకారం అగర్తల నియోజకవర్గం నుంచి రాయ్ బర్మన్ తిరిగి పోటీ చేయనున్నారు.  రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బిరాజిత్ సిన్హా కైలాసహర్ నుంచి బరిలోకి దిగనున్నారు. 

PREV
click me!

Recommended Stories

PF Rules 2026 : పీఎఫ్ ఖాతాదారులకు డబుల్ జాక్‌పాట్..! ఇకపై నెలకు రూ.6,000 జమ
Dhurandhar 2: ధురంధర్ 2లో రణ్‌వీర్ కంటే మోదీ క్రేజే ఎక్కువ.. అసలు ఆ సీన్ల వెనుక కథేంటి?