బీహార్‌లో కల్తీ మద్యం విధ్వంసం.. 70 మందికి పైగా మృత్యువాత !

Published : Dec 17, 2022, 03:00 PM IST
బీహార్‌లో కల్తీ మద్యం విధ్వంసం.. 70 మందికి పైగా మృత్యువాత !

సారాంశం

బీహార్‌లోని సరన్ జిల్లాలోని మష్రక్, ఇసువాపూర్, మధురా, అమ్నౌర్ బ్లాక్‌లలో గత నాలుగు రోజుల్లో కల్తీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 70 దాటింది. అదే సమయంలో 16 మంది రోగులు ఛప్రాలోని సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బీహార్ లో విషాదం: బీహార్‌లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత నాలుగు రోజుల్లో సరన్ జిల్లాలోని మష్రక్, ఇసువాపూర్, మధురా, అమ్నౌర్ బ్లాక్‌లలో 70 మందికిపైగా చనిపోయారు. అదే సమయంలో.. 16 మంది రోగులు ఛప్రాలోని సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. సివాన్‌లోని భగవాన్‌పూర్ బ్లాక్‌లోని సరన్‌లో, సోంధాని, బ్రహ్మస్థాన్ గ్రామాల్లో విషపూరిత మద్యం సేవించడం వల్ల వాచ్‌మెన్‌తో సహా ఐదుగురు మరణించారు.

70 మందికి పైగా మృత్యువాత

కల్తీ మద్యం సివాన్‌లో కూడా సరఫరా చేయబడిందని స్తానికులు చెపుతున్నారు. దీంతో పాటు కల్తీ మద్యం తాగి ఇద్దరు బంధువులు మృతి చెందిన ఉదంతం బెగుసరాయ్‌లో వెలుగుచూసింది. ఇప్పటి వరకు 32 మంది మృతి చెందగా, 16 మందికి చికిత్స అందించినట్లు సరన్ ఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. అదే సమయంలో ఘటన జరిగిన మూడోరోజు కూడా మద్యం మత్తులో మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా కథనాల ప్రకారం.. శుక్రవారం మష్రక్, అమ్నౌర్,ఇసువాపూర్‌లో 28 మంది మరణించారు. ఇదే సమయంలో హడావుడిగా కొన్ని మృతదేహాలను కుటుంబ సభ్యులు దహనం చేసిన విషయం తెరపైకి వస్తోంది. ఆదర్శ్ పంచాయతీ బెహ్రౌలీలో కూడా 15 మంది మరణించారు.

213 మంది అరెస్టు  

ఈ కేసులో ఇప్పటివరకు 213 మంది వ్యాపారవేత్తలను వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాటు ఆరు వేల లీటర్ల స్వదేశీ, విదేశీ మద్యం, స్పిరిట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు సభ్యుల దర్యాప్తు బృందం నివేదిక ఇంకా అదనపు ప్రధాన కార్యదర్శికి అందలేదు. అదే సమయంలో.. క్యాపిటల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు కూడా ఛప్రాలో నకిలీ మద్యం సేవించి మరణించాడు. ఆ ప్రయాణికుడు కిషన్‌గంజ్‌లో మరణించాడు.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu