రిపబ్లిక్ డే: ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర, ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్

Siva Kodati |  
Published : Jan 09, 2020, 08:34 PM IST
రిపబ్లిక్ డే: ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర, ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్

సారాంశం

రిపబ్లిక్ డే వేడుకులను టార్గెట్ చేసి భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసు భగ్నం చేశారు. దేశ రాజధానిలో వాజీరాబాద్ ప్రాంతంలో గురువారం ఉదయం అనుమానితుల్ని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు వెళ్లారు. 

రిపబ్లిక్ డే వేడుకులను టార్గెట్ చేసి భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసు భగ్నం చేశారు. దేశ రాజధానిలో వాజీరాబాద్ ప్రాంతంలో గురువారం ఉదయం అనుమానితుల్ని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు వెళ్లారు.

Also Read:జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్తత: విద్యార్ధులను అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు

అయితే దుండగులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. వీరిని ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలోని పలు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:జెఎన్ యూ వివాదం: కారణం తెలుగు వ్యక్తే, ఆయనెవరంటే....

అరెస్ట్ చేసిన వారిని ఖాజా మొయిద్దీన్, అబ్దుల్ సమద్, సయ్యద్ అలీ నవాజ్‌గా తెలిపారు. ఉగ్రవాదులను అనంతరం విచారణ నిమిత్తం పీఎస్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నేపాల్ నుంచి కొందరు ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ రెండు రోజుల క్రితమే హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Santal Conference : బెంగాల్‌లో రాష్ట్రపతికి అవమానం? మోదీ వర్సెస్ మమత.. అసలేం జరిగింది?
నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌