ఒడిశాలో ఎన్ కౌంటర్: ముగ్గురు మావోయిస్టుల మృతి

Published : May 09, 2023, 03:00 PM IST
ఒడిశాలో  ఎన్ కౌంటర్: ముగ్గురు మావోయిస్టుల మృతి

సారాంశం

ఒడిశా రాష్ట్రంలోని కలహండిలో  ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. 

భువనేశ్వర్:ఒడిశా రాష్ట్రంలోని  కలహండి జిల్లాలో  మంగళవారంనాడు జరిగిన ఎన్  కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కలహండి జిల్లాలోని  ఎం. రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపరెంగా-లుడెన్ గా అటవీ ప్రాంతంలో ఇవాళ  మావోయిస్టులు,  పోలీసులకు మధ్య  ఎదురుకాల్పులు చోటు  చేసుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున  కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి.  ఈ ఘటనలో  ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ లో డీఎస్పీకి గాయాలయ్యాయి.డీఎస్పీని  బోలరింగ్  లోని  భీమాబోయ్ ఆసుపత్రిలో చేర్పించారు. 

ఈ ప్రాంతంలో  మావోయిస్టుల కదలికలున్నాయనే  సమాచారంతో  పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.  అయితే  ఇవాళ  పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.  దీంతో  ఎన్ కౌంటర్  జరిగింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో  ఈ ఏడాది  ఏప్రిల్  26న మావోయిస్టులు  పేల్చిన మందుపాతరలో  11 మంది జవాన్లు  మృతి చెందారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi: 10 కోట్లు దాటిన మోదీ ఇన్‌స్టా ఫాలోవ‌ర్లు.. ప్ర‌ధానికి సోష‌ల్ మీడియా ద్వారా డ‌బ్బులొస్తాయా.?
Toll Pass : కేవలం రూ.340 టోల్ పాస్.. నెెలంతా ఫ్రీగా తిరగొచ్చు..!