ప్రజాస్వామ్యాన్ని అణచివేసే వారే దానిని కాపాడుతామని మాట్లాడుతున్నారు - బీజేపీపై ఖర్గే ఫైర్

Published : Mar 13, 2023, 01:40 PM IST
ప్రజాస్వామ్యాన్ని అణచివేసే వారే దానిని కాపాడుతామని మాట్లాడుతున్నారు - బీజేపీపై ఖర్గే ఫైర్

సారాంశం

ప్రజాస్వామ్యాన్ని అణచివేసే వారు దానిని కాపాడటం గురించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అదానీ అంశంపై మాట్లాడేందుకు తనకు పది నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదని, కానీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడడానికి 10 నిమిషాల సమయం ఇచ్చారని ఆయన ఆరోపించారు. 

ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, అదానీ వివాదం వంటి అంశాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో సోమవారం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రాన్ని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే, నాశనం చేసే వారే దానిని కాపాడుతామని మాట్లాడుతున్నారని విమర్శించారు. 

మధ్యాహ్నం 12 గంటల దాకా పడుకుంటుంది, వంట చేయదు: భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన ప్రసంగంలో రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడంతో ఎగువ సభలో వాగ్వాదం జరిగింది. ఒక ప్రతిపక్ష నాయకుడు విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు దేశాన్ని పేలవంగా చూపించడానికి ప్రయత్నించారని గోయల్ పేర్లు ప్రస్తావించకుండా ఆరోపించారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ.. గోయల్ తనదైన శైలిలో ప్రసంగాన్ని సమర్పించారని చెప్పారు.

అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని తాము డిమాండ్ చేశామని, తనను రెండు నిమిషాలు కూడా మాట్లాడనివ్వలేదని ఖర్గే ఆరోపించారు. పీయూష్ గోయల్ కు మాట్లాడేందుకు 10 నిమిషాల సమయం ఇచ్చారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆరోపించారు. ప్రధాని మోదీ నియంతలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని, దేశ గౌరవాన్ని కాపాడటం గురించి బీజేపీ మాట్లాడుతోందని ఖర్గే విమర్శించారు. 

నెల రోజుల విరామం తర్వాత ఈ ఉదయం ప్రారంభమైన రాజ్యసభ కార్యకలాపాలు మైక్ లు ఆఫ్ అయ్యాయంటూ విపక్షాలు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం భారత్ ను కించపరిచేలా ఉందని, క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో జరిగిన ఓ ఉపన్యాసంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉందని, దాడి జరుగుతోందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu