ఎంపీ పాదాలు కడిగి.. ఆ నీరుతాగిన అభిమాని

Published : Sep 17, 2018, 02:37 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
ఎంపీ పాదాలు కడిగి.. ఆ నీరుతాగిన అభిమాని

సారాంశం

దికపై అంతా చూస్తుండగానే ఓ కార్యకర్త ఎంపీ పాదాలను పళ్లెంలో కడిగి.. ఆ నీటిని తాగాడు. అనంతరం తలపై కూడా చల్లుకున్నాడు.

ఎవరి మీదైనా అభిమానం ఉండొచ్చు కానీ.. మరీ ఇంతలా ఉండకూడదేమో. మనకన్నా పెద్దవారికి.. కాళ్లు కడిగారంటే.. వారంటే అభిమానం అనుకోవచ్చు. కానీ.. ఆ కడగిన నీటిని తాగితే.. ఇలానే చేశాడు ఓ వ్యక్తి. ఎంపీ కాళ్లు కడిగి ఆ నీటిని తాగాడు. ప్రస్తుతం ఈ ఘటనకుయ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే...జార్ఖండ్‌లో భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే నిన్న గొడ్డాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే సభలో వేదికపై అంతా చూస్తుండగానే ఓ కార్యకర్త ఎంపీ పాదాలను పళ్లెంలో కడిగి.. ఆ నీటిని తాగాడు. అనంతరం తలపై కూడా చల్లుకున్నాడు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు కార్యకర్త ప్రవర్తనను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో హల్‌చల్‌ చేస్తోంది. భాజపాలో వ్యక్తి పూజ పెరిగిపోతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం అని ప్రతిపక్షాలు ఎంపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి.

PREV
click me!

Recommended Stories

ఇదేందయ్యా ఇదీ.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కన్నడ మాట్లాడేవారు తక్కువా..!
హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు