యావత్ ప్రపంచం ఎంతో ఆశతో భారత్ వైపు చూస్తోంది : ప్రధాని నరేంద్ర మోడీ

Published : May 25, 2023, 04:00 PM IST
యావత్ ప్రపంచం ఎంతో ఆశతో భారత్ వైపు చూస్తోంది : ప్రధాని నరేంద్ర మోడీ

సారాంశం

New Delhi: వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా భారత్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన తీరును ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని గురువారం ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ ముక్కోణపు పర్యటన ముగించుకుని తాను ఇప్పుడే తిరిగి వచ్చాననీ, ప్రపంచం మొత్తం భారత్ వైపు ఎంతో ఆశతో చూస్తోందని చెప్పగలనని అన్నారు.  

Delhi-Dehradun Vande Bharat train: వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా భారత్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన తీరును ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని గురువారం ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. "ప్రపంచ పర్యాటకులు భారత్ ను సందర్శించి ఆ దేశాన్ని చూసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఉత్తరాఖండ్ కు ఇదొక గొప్ప అవకాశం" అని ప్రధాని పేర్కొన్నారు. ముక్కోణపు పర్యటన ముగించుకుని తాను ఇప్పుడే తిరిగి వచ్చానని, ప్రపంచం మొత్తం భారత్ వైపు ఎంతో ఆశతో చూస్తోందని చెప్పగలనని మోడీ అన్నారు.

వివరాల్లోకెళ్తే.. డెహ్రాడూన్-ఢిల్లీ మధ్య నడిచే తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచం భారతదేశాన్ని ఎంతో ఆశతో చూస్తోందనీ, దాని సారాంశాన్ని చూడటానికి, అర్థం చేసుకోవడానికి ప్రపంచం భారతదేశానికి రావాలని కోరుకుంటోందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు. 

యావత్ ప్రపంచం భారత్ ను ఎంతో ఆశతో చూస్తోంది. భారతదేశాన్ని చూడటానికి, భారతదేశ సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచం భారతదేశానికి రావాలని కోరుకుంటుంది, ఇటువంటి పరిస్థితిలో ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఉత్తరాఖండ్ కు వందే భారత్ రైలు కూడా సహాయపడుతుంది: ప్రధాని మోడీ 

 

ఉత్తరాఖండ్ లో ప్రారంభించిన వందే భారత్ రైలు గురించి మాట్లాడుతూ, ఇది దేశ రాజధానిని వేగంగా కలుపుతుందని, ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. "ఢిల్లీ- డెహ్రాడూన్ మధ్య నడిచే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు దేశ రాజధానిని వేగంగా కలుపుతుంది. ఈ రైలుతో ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. రైలులోని సౌకర్యాలు ఈ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి" అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కాగా, వాణిజ్య సేవలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు డెహ్రాడూన్ నుంచి ప్రారంభ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరుతుంది. ఢిల్లీ, డెహ్రాడూన్ లను కలిపే వందే భారత్ రైలు రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి కేవలం 4 గంటల 45 నిమిషాలు పడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మార్గంలో ఈ నెల 29 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఎనిమిది బోగీల ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మీరట్, ముజఫర్ నగర్, సహారన్ పూర్, రూర్కీ, హరిద్వార్లలో ఆగుతుంది. రెగ్యులర్ సర్వీసులు తిరిగి ప్రారంభమైనప్పుడు, డెహ్రాడూన్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఉదయం 7 గంటలకు డెహ్రాడూన్ నుండి బయలుదేరి ఉదయం 11.45 గంటలకు ఆనంద్ విహార్ టెర్మినల్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమై రాత్రి 10.35 గంటలకు డెహ్రాడూన్ చేరుకుంటుంది. 22457/22458 నంబరు గల ఈ రైలు హరిద్వార్, రూర్కీ, సహారన్ పూర్, ముజఫర్ నగర్, మీరట్ సిటీ స్టేషన్లలో రెండు వైపులా ఆగుతుంది. గతంలో, డెహ్రాడూన్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు, ఇది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి డెహ్రాడూన్ వరకు ఐదు గంటల యాభై నిమిషాల ప్రయాణాన్ని కవర్ చేస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu