ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్ పదవీకాలాన్ని పొడిగించిన సుప్రీంకోర్టు.. ఎప్పటి వరకు అంటే ?

Published : Jul 28, 2023, 11:04 AM IST
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్ పదవీకాలాన్ని పొడిగించిన సుప్రీంకోర్టు.. ఎప్పటి వరకు అంటే ?

సారాంశం

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని సుప్రీంకోర్టు పొడిగించింది. ఆయన పదవి కాలం సెప్టెంబర్ 15 వరకు ఉంటుందని పేర్కొంది. అంతకు మించి పెంచడం కుదరదని తెలిపింది.

ప్రజా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. సెప్టెంబర్ 15-16 అర్ధరాత్రి నుంచి మిశ్రా ఈడీ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకుంటారని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. 

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులకు ఇచ్చిన ఆహారంలో బొద్దింక.. ఫొటోలు వైరల్.. స్పందించిన ఐఆర్సీటీసీ

అయితే పొడిగింపును ఆమోదించే ముందు సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ఈడీ మొత్తం అసమర్థ వ్యక్తులతో నిండి ఉందని కేంద్రం కేంద్రం ఒప్పుకుంటుందా అని కోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. ‘‘మీ డిపార్ట్ మెంట్ మొత్తం అసమర్థులతో నిండిపోయిందని, మీ డిపార్ట్ మెంట్ లో సమర్థులైన వ్యక్తి ఒక్కరే ఉన్నారని, ఈ ఒక్క వ్యక్తి లేకుండా మీరు పనిచేయలేరని మీరు చిత్రాన్ని ఇవ్వడం లేదా? ఇది మొత్తం శక్తి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కాదా? నేను సీజేఐగా ఉండి నేను కొనసాగలేననుకుంటే సుప్రీంకోర్టు కూలిపోతుందా?’’ అని ధర్మాసనం ప్రిసైడింగ్ జడ్జి జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.

కాగా.. సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి దరఖాస్తును స్వీకరించలేమని కోర్టు అభిప్రాయపడింది. అయితే మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకు పొడిగించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు గడువు పొడిగించింది. అంతకు ముందు జూలై 31లోగా మిశ్రా పదవి నుంచి వైదొలగాలని కోర్టు జూలై 11న ఆదేశించింది. ప్రస్తుతం జరుగుతున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమీక్షను ఉదహరించిన కేంద్రం ఈడీ చీఫ్ గా మిశ్రా కొనసాగింపు అవసరమని పేర్కొంది. 

భార్యను హతమార్చి.. రెండేళ్ల కూతురును రైలు పట్టాలపై పడుకోబెట్టి.. దారుణం

ఇదిలా ఉండగా.. మిశ్రాకు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. దీనిపై కోర్టు వెంటనే స్పందిస్తూ.. ‘‘లేదు. విస్తృత జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని దీన్ని కూడా మంజూరు చేశాం.’’ అని పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

Modi Visits Kashi Vishwanath Temple:వారాణసి శ్రీకాశీవిశ్వనాథ ఆలయంలో మోదీ పూజలు| Asianet News Telugu
ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?