కరోనా మహమ్మారి మళ్లీ ఎప్పుడైనా రావొచ్చు.. జాగ్రత్తగా ఉండాలి - నిపుణుల హెచ్చరిక

Published : Mar 24, 2024, 09:24 PM IST
కరోనా మహమ్మారి మళ్లీ ఎప్పుడైనా రావొచ్చు.. జాగ్రత్తగా ఉండాలి - నిపుణుల హెచ్చరిక

సారాంశం

కోవిడ్ -19 మహమ్మారి మళ్లీ ఎప్పుడైనా విరుచుకుపడే అవకాశం ఉందని యూకేలోని అంటువ్యాధుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని, కాకపోతే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

కరోనా వైరస్ దేశం నుంచి, ప్రపంచం నుంచి వెళ్లిపోయిందని అందరం ప్రశాంతంగా ఉన్నాం కదా.. అయితే ఇది పూర్తిగా ఇంకా వెళ్లిపోలేదు. కాకపోతే దాని ప్రభావం తగ్గింది. కానీ ఏ క్షణంలోనైనా మరో మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాలుగేళ్ల కిందట ఈ కోవిడ్ -19  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. మళ్లీ నిపుణులు ఇలాంటి హెచ్చరిక చేయడం ఆందోళన కలిగిస్తోంది.

స్కై న్యూస్ నివేదిక ప్రకారం.. వైరస్ లు జంతువుల నుండి మానవులకు వ్యాపించి మరొక మహమ్మారికి కారణమయ్యే అవకాశం ఉందని యూకేలోని అంటువ్యాధుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘తదుపరి మహమ్మారి సమీపిస్తోంది. ఇది రెండు సంవత్సరాలకు కావొచ్చు. 20 సంవత్సరాలకు కావచ్చు, ఇది ఎక్కువ కాలం ఉండవచ్చు. మనం అప్రమత్తంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. మళ్లీ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి’’ అని కింగ్స్ కాలేజ్ లండన్ లోని అంటువ్యాధుల క్లినికల్ లెక్చరర్ డాక్టర్ నథాలీ మెక్డెర్మాట్ చెప్పారు.

గ్లోబల్ వార్మింగ్, అడవుల నరికివేత వల్ల వైరస్ లు లేదా బ్యాక్టీరియా జంతువుల నుంచి మనుషుల్లోకి ప్రవేశించే ప్రమాదం పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెజాన్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో చెట్లను నరికివేయడం ద్వారా, జంతువులు, కీటకాలు మానవ ఆవాసాలకు దగ్గరగా వెళుతున్నాయని డాక్టర్ మెక్డెర్మాట్ వివరించారు.

అంతేకాక పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో, దోమలు, డెంగ్యూ, చికున్ గున్యా, క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ (సిసిహెచ్ఎఫ్) వంటి టిక్-జనిత వైరస్ల వ్యాప్తి గతంలో ప్రభావితం కాని ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో సంభవిస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu