న్యూఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో కూలిన నిర్మాణం: ఎనిమిది మంది కార్మికులకు గాయాలు

Published : Feb 17, 2024, 01:10 PM ISTUpdated : Feb 17, 2024, 01:33 PM IST
 న్యూఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో కూలిన నిర్మాణం: ఎనిమిది మంది కార్మికులకు గాయాలు

సారాంశం

న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం గేట్ సమీపంలో  తాత్కాలిక నిర్మాణం కుప్పకూలింది.ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. 

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని  జవహర్ లాల్ నెహ్రు స్టేడియం గేట్ సమీపంలోని తాత్కాలిక నిర్మాణం కుప్పకూలడంతో  ఎనిమిది మంది గాయపడ్డారు. జవహర్ లాల్ నెహ్రు కు స్టేడియం   రెండో నెంబర్ గేట్ కు సమీపంలో  నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల్లో  కొంత భాగం కూలిపోయింది. నిర్మాణ భాగంలోని శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నారు.ఇందులో  ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే  పోలీసులు,  అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో గాయపడిన కార్మికులను  ఆసుపత్రికి తరలించారు. ఈ శిథిలాల కింద ఇంకా కొందరు కార్మికులు చిక్కుకున్నారేమోననే అధికారులు ఆరా తీస్తున్నారు.  ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఓ పెళ్లి కోసం తాత్కాలిక నిర్మాణాన్ని ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. కార్మికులు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో  నిర్మాణ పనుల్లో ఎక్కువ మంది కార్మికులు లేరు.  దీంతో ఈ ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎక్కువగా లేరు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న కార్మికులు గాయపడ్డారని ప్రత్యక్షసాక్షులు చెప్పారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్