ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోడీ విఫలం: కేటీఆర్

Published : Jun 22, 2022, 02:02 PM IST
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోడీ విఫలం: కేటీఆర్

సారాంశం

KTR: కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లతో విరుచుకుప‌డ్డారు. అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెట్టి యువత రక్షణ దళాల్లో చేరాలనే కలను బీజేపీ ప్రభుత్వం తుడిచిపెట్టిందని, సాయుధ బలగాలను అపహాస్యం చేసిందని ఆయ‌న‌ ఆరోపించారు.  

Telangana: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం నాశనమైందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని తెలంగాణ‌ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ. రామారావు (కేటీఆర్‌) ఆరోపించారు. అలాగే, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీమ్ పైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మంగళవారం కైత్లాపూర్‌ రాబ్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రధాని పూర్తిగా విఫలమయ్యారని విమ‌ర్శించారు.  గత ఎనిమిదేళ్లలో దేశ ప్రగతికి అబద్ధాలు, విద్వేషాలు, విద్వేషాలు ప్రచారం చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాన్ని సృష్టించ‌డంతో పాటు ఉద్రిక్త‌ల‌కు కార‌ణ‌మవుతున్న అగ్నిప‌థ్ స్కీమ్ పైనా విమ‌ర్శ‌లు ఉప్పించారు.  అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెట్టి యువత రక్షణ దళాల్లో చేరాలనే కలను బీజేపీ ప్రభుత్వం తుడిచిపెట్టిందని, సాయుధ బలగాలను అపహాస్యం చేసిందని  మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అగ్నిపథ్ యువతకు బార్బర్‌లు, వాషర్‌మెన్‌లు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్‌లుగా శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉజ్వల భవిష్యత్తును కల్పించిందని కేంద్ర మంత్రి చేసిన ప్రకటనను ఉటంకిస్తూ, యువత నిజంగా ఈ ఉద్యోగాల కోసం సాయుధ దళాలలో చేరారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.  నోట్ల రద్దుతో 50 రోజుల్లోగా రూ.15 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, నల్లధనాన్ని నిర్మూలిస్తామని, డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను అదుపు చేయడంలో విఫలమైన నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాలను ప్ర‌స్తావిస్తూ.. బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌ల దాడి కొన‌సాగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందక‌పోవ‌డంతో పాటు తెలంగాణకు తీర‌ని అన్యాయం జరుగుతున్న‌ద‌ని పేర్కొన్నారు. 

మరికొద్ది రోజుల్లోనే ప్రధానమంత్రి, కేంద్రమంత్రులతో సహా అగ్రనేతలందరినీ హైదరాబాద్‌కు రప్పించుకోవాలని, తెలంగాణకు కేంద్రం ఎలాంటి సహాయం, మద్దతు ఇవ్వనప్పుడు ఇక్కడ ఏం చేస్తారో చెప్పాలని బీజేపీ యోచిస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణకు ఏం చేశారో, రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్టులు మంజూరు చేశారో నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలంతా ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

 

ఇదిలావుండగా, మంత్రి హరీష్ రావు సైతం కేంద్ర బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ సమస్యను మరింత పెంచుతోందని ఆరోపించారు. ఇంతకాలం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించకపోగా... ఇప్పుడేమో అగ్నిపథ్ పథకం పేరిట కొత్త నాటకానికి తెరతీసారని ఆరోపించారు. ఆర్మీ ఉద్యోగాల కోసం బీజేపీ సర్కార్ కొత్త పథకం తీసుకువచ్చి నిరుద్యోగ యువత ఉసురు పోసుకుంటోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేసారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu