భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం: సయ్యద్ సల్మాన్ చిస్తీ

Published : Aug 10, 2023, 04:46 PM IST
భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం: సయ్యద్ సల్మాన్ చిస్తీ

సారాంశం

ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ASEAN inter-religious meeting 2023 ప్రారంభ సెషన్‌లో హాజీ సయ్యద్ సల్మాన్ చిస్తీ మాట్లాడుతూ.. భారతదేశం "వసుధైవ కుటుంబం" అనీ, ఈ దేశ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని అన్నారు. 

భారతదేశం విభిన్న సంస్కృతులు సమ్మేళనం. ఈ దేశ చరిత్ర, వారసత్వం, సంస్కృతి, మత సంప్రదాయలు చాలా విభిన్నం. భారత దేశ బహుత్వ స్వరూపం.. సహనం, సహజీవన విలువలకు నిదర్శనం. మతపరమైన, సాంస్కృతిక అపార్థాలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలను భారత్ ప్రోత్సహిస్తుంది.

ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ASEAN inter-religious meeting 2023 ప్రారంభ సెషన్‌లో ప్రముఖ భారతీయ సూఫీ ఆధ్యాత్మిక నాయకుడు, చిస్తీ ఫౌండేషన్ ఛైర్మన్ హాజీ సయ్యద్ సల్మాన్ చిస్తీ మాట్లాడుతూ.. శాంతి, భద్రత, శ్రేయస్సును ప్రోత్సహించడానికి ASEAN ఓ  సమన్వయ కేంద్రంగా పనిచేస్తుందని అన్నారు. చర్చల ద్వారా ఇతరులను అనుసంధానం చేస్తూ.. అజ్ఞానం, పక్షపాతపు గోడలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు. 

విశాలమైన మానవ కుటుంబాన్ని ఆలింగనం చేసుకుంటూ.. దేశ ప్రత్యేక గుర్తింపును కాపాడుకుంటూ అన్ని కమ్యూనిటీలు అభివృద్ధి చెందే వాతావరణాన్ని సృష్టించగలమని అన్నారు. ఆసియాన్ ప్రాంతంలో మతాల మధ్య, సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో చురుకైన పాత్ర పోషించేందుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించే, విభిన్న సంస్కృతులను ప్రోత్సహించడం, సామాజిక ఐక్యతను బలోపేతం చేసే కార్యక్రమాలకు తాము మద్దతునిస్తూనే ఉంటామని అన్నారు.

ఈ శిఖరాగ్ర సమావేశం శాశ్వత భాగస్వామ్యానికి, సహకారానికి ఊతమిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఆసియాన్ దేశాలకు శాంతియుత, సహనం, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం ASEAN సదస్సు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. చిస్తీ ఫౌండేషన్ ఛైర్మన్ హాజీ సయ్యద్ సల్మాన్ చిస్తీ తన సుదీర్ఘ ప్రసంగంలో భారతదేశం యొక్క వివిధ లక్షణాలను ఎత్తిచూపారు.  ఆసియాన్ ప్రాంతాలతో  సహా వివిధ చారిత్రక, సాంస్కృతులపై భారత్ ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ ప్రభావాలు ప్రధానంగా భారతదేశ చారిత్రక వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి, ఆగ్నేయాసియా దేశాలతో మతపరమైన సంబంధాలు పెంపొందించాయనీ,  ఆసియాన్ ప్రాంతంలోని పలు రంగాలపై భారత్ ప్రభావం చూపుతోందని తెలిపారు.  

ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్, మయన్మార్ వంటి అనేక ఆగ్నేయాసియా దేశాల మతపరమైన విషయాలపై ఇస్లాం, హిందూ , బౌద్ధమతం గణనీయమైన పాత్ర పోషించాయని చిస్తీ చెప్పారు. అనేక పురాతన దేవాలయాలు, మతపరమైన నిర్మాణాలు భారతీయ సంప్రదాయాల వాస్తు, కళాత్మక శైలుల ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు.

దక్షిణాసియా అంతటా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతిధ్వనిస్తుందనీ, సూఫీ యాత్ర భక్తులను, వివిధ విశ్వాసాలను భారత్ ఆకర్షిస్తుందని అన్నారు. అలాగే.. ప్రాచీన భారతీయ భాష సంస్కృతం ప్రభావం కూడా ఆగ్నేయాసియా భాషల లిపి, పదజాలంపై ప్రభావం చూపుతోందనీ, కంబోడియాలోని ఖైమర్ లిపి, థాయ్‌లాండ్‌లోని థాయ్ లిపి వంటి ఇతర దేశాల లిపులపై సంస్కృతం ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. 
 
అలాగే.. భారతీయ కళారూపాలైన నృత్యం, సంగీతం, సాంప్రదాయ ప్రదర్శనల ప్రభావం  పలు ఆసియాన్ దేశాల సాంస్కృతులపై కూడా ఉందని తెలిపారు. స్థానిక సంప్రదాయాలతో ఒక ప్రత్యేక సమ్మేళనాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది మాత్రమే కాదు.. భారత్ .. ఇతర ఆగ్నేయాసియా దేశాలతో సముద్ర వాణిజ్యానికి సుదీర్ఘ చరిత్రను కలిగి ఉందనీ, పురాతన సముద్ర వాణిజ్య మార్గాలు భారతదేశాన్ని ఆగ్నేయాసియాలోని వివిధ నౌకాశ్రయాలతో అనుసంధానించాయి. సాంస్కృతిక వ్యాప్తి, సాంస్కృతిక పరస్పర చర్యలకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. రామాయణం, మహాభారతం వంటి భారతీయ ఇతిహాసాలు అనేక ఆగ్నేయాసియా దేశాల సాహిత్య, సాంస్కృతిక సంప్రదాయాలను  ప్రభావితం చేశాయి. ఈ ఇతిహాసాల స్థానిక సంస్కరణలు, అనుసరణలు తరచుగా ఈ ప్రాంతంలోని జానపద కథలు, కథలలో మిళితమయ్యాయి. 
  
సయ్యద్ సల్మాన్ చిస్తీ మాట్లాడుతూ.. భారతీయ పండుగలైన దీపావళి, హోలీ, వెసక్ (బుద్ధుని జన్మదిన వేడుకలు) కొన్ని ఆసియాన్ దేశాల్లోని కమ్యూనిటీలు జరుపుకుంటున్నాయని, ఇది భారతీయ సంస్కృతీ సంప్రదాయాల యొక్క నిరంతర ఔచిత్యాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. భారతీయ పండితులు, ఉపాధ్యాయులు ఆగ్నేయాసియాలో విజ్ఞానాన్ని అందించడానికి, మేధో మార్పిడిని ప్రోత్సహించబడ్డాయని అన్నారు.   
 
నృత్యం, ప్రదర్శన కళలతో పాటు, భరతనాట్యం,  ఒడిస్సీ వంటి సాంప్రదాయ భారతీయ నృత్య రూపాలు ఆగ్నేయాసియా దేశాలలో నృత్య సంప్రదాయాలను ప్రభావితం చేశాయని, ఫలితంగా దేశీయ, భారతీయ అంశాలను పొందుపరిచే ప్రత్యేక నృత్య రీతులు వచ్చాయని చెప్పారు. కొన్ని ASEAN దేశాలలో భారతీయ పండుగలను స్థానిక సంఘాలు జరుపుకుంటాయనీ, జాతీయ సాంస్కృతిక క్యాలెండర్‌లో విలీనం చేయబడ్డాయని అన్నారు. సాధారణ తాత్విక, ఆధ్యాత్మిక భావనలను పరిశీలిస్తే.. కర్మ, ధర్మం, మోక్షం వంటి భారతీయ తాత్విక ఆలోచనలు కొన్ని ఆగ్నేయాసియా సమాజాల ఆధ్యాత్మిక విశ్వాసాలు, అభ్యాసాలలో ప్రతిధ్వనినిస్తున్నాయని అన్నారు.  

భారతీయ చిత్రాలు, ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలు కొన్ని ఆగ్నేయాసియా దేశాల్లో ఆదరణ పొందాయని, భారతీయ సంస్కృతి, సంగీతం, నృత్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాయని అన్నారు. భారతదేశం, ఆగ్నేయాసియా దేశాల మధ్య పరస్పర ప్రశంసలు, అవగాహన ఉందని సయ్యద్ సల్మాన్ చిస్తీ అన్నారు. సంస్కృతులు అభివృద్ధి చెందుతూనే ఉన్నందున, ఈ చారిత్రక సంబంధాలు మరింత సహకారం, స్నేహం అభివృద్ధి చెందడానికి బలమైన పునాదిని అందిస్తాయని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu