సీఏఏ సవాలు పిటిషన్లపై డిసెంబర్ 6న సుప్రీంకోర్టు విచారణ

Published : Oct 31, 2022, 08:05 PM ISTUpdated : Oct 31, 2022, 08:08 PM IST
సీఏఏ సవాలు పిటిషన్లపై డిసెంబర్ 6న సుప్రీంకోర్టు విచారణ

సారాంశం

Supreme Court: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై డిసెంబర్ 6న సుప్రీంకోర్టు విచారణ జ‌ర‌ప‌నుంది. అస్సాం, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో రెండు వారాల్లోగా స్పందన తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  

Citizenship Amendment Act: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై డిసెంబర్ 6న సుప్రీంకోర్టు విచారణ జ‌ర‌ప‌నుంది. అస్సాం, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో రెండు వారాల్లోగా స్పందన తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

వివ‌రాల్లోకెళ్తే.. పౌరసత్వ (సవరణ) చట్టం-2019ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను డిసెంబర్ 6న విచారిస్తామనీ, కేసుకు సంబంధించిన అన్ని సంబంధిత పత్రాల సంకలనం కోసం ఇద్దరు నోడల్ న్యాయవాదులను నియమిస్తూ సుప్రీంకోర్టు సోమవారం నిర్ణ‌యం తీసుకుంది. అస్సాం, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా తమకు సంబంధించిన విషయాలపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సీఏఏ రాజ్యాంగ‌ చెల్లుబాటును సవాలు చేస్తూ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU), ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌లను భారత ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్, న్యాయమూర్తులు ఎస్. రవీంద్ర భట్, బేల ఏం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది.

అన్ని సంబంధిత పత్రాలను రూపొందించడానికి న్యాయవాదులు పల్లవి ప్రతాప్, పిటిషనర్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) తరపు న్యాయవాది, ప్ర‌ముఖ న్యాయవాది కాను అగర్వాల్ (కేంద్ర ప్రభుత్వ న్యాయవాది)లను నోడల్ న్యాయవాదిగా ధర్మాసనం నియమించింది. “బహుళ అభిప్రాయాలను ప్రొజెక్ట్ చేసే వివిధ అభ్యర్ధనలు ఉన్నాయని గమనించిన తర్వాత, రెండు లేదా మూడు విషయాలను ప్రధాన అంశాలుగా తీసుకుంటే మొత్తం వివాదానికి పరిష్కారం సాధించవచ్చు. అన్ని న్యాయవాదుల అనుకూల సంకలనాలను చాలా ముందుగానే సిద్ధం చేయవచ్చు. ఇది ప్రొసీడింగ్‌లను సౌకర్యవంతంగా చేస్తుంది” అని ధ‌ర్మాస‌నం పేర్కొంది.

సీఏఏ సంబంధిత విషయాల‌కు సంబంధించిన సంకలనాన్ని న్యాయవాదులందరితో పంచుకోవాలనీ, భౌగోళిక/మతపరమైన వర్గీకరణను దృష్టిలో ఉంచుకుని ఒకటి లేదా రెండు ఇతర విషయాలను ప్రధాన అంశాలుగా నియమించాలని నోడల్ న్యాయవాదిని అత్యున్నత న్యాయస్థానం కోరింది. సీఏఏ అనేది భారత పౌరసత్వం పొందేందుకు ప్రస్తుతం ఉన్న పాలనపై ప్రభావం చూపదనీ, చెల్లుబాటు అయ్యే పత్రాలు, వీసా ఆధారంగా చట్టపరమైన  అన్ని దేశాల నుంచి వలసలు అనుమతించదగినవిగా కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం ఆదివారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్లను కొట్టివేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరుతూ, ప్రభుత్వం తన అఫిడవిట్‌లో ఈ చట్టం అస్సాంలోకి అక్రమ వలసలను ఏ విధంగానూ ప్రోత్సహించదు అని పేర్కొంది. దీనిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు నిరాధారమైన...ఆందోళనగా పేర్కొంది.

 

కాగా, సీఏఏకు వ్య‌తిరేకంగా ఈశాన్య భార‌తం స‌హా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదివ‌ర‌కు నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు కొన‌సాగాయి. సీఏఏను వ్య‌తిరేకిస్తూ కొన‌సాగిన నిర‌స‌న‌లు ప‌లుచోట్ల హింసాత్మ‌కంగా మారాయి. 2019 డిసెంబర్ 20న మీరట్‌లో ఐదుగురు వ్యక్తులు మరణించడం రెండు వారాల నిరసనలలో అత్యంత తీవ్రమైన హింసాత్మకంగా మారాయి. కొత్త చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగడంతో పోలీసులు కాల్చి చంపారని ఐదుగురు మృతుల కుటుంబాలు ఆరోపించాయి. 

 

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?