సుప్రీంకోర్టు నిర్ణయం ఆమోదయోగ్యం కాదు.. రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదలపై కాంగ్రెస్

Published : Nov 11, 2022, 04:17 PM IST
సుప్రీంకోర్టు నిర్ణయం ఆమోదయోగ్యం కాదు.. రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదలపై కాంగ్రెస్

సారాంశం

రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. భారత స్ఫూర్తికి అనుగుణంగా సుప్రీంకోర్టు వ్యవహించలేదని పేర్కొంది. 

రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, పూర్తిగా తప్పు అని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ దానిని స్పష్టంగా విమర్శిస్తోందని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ  ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఒక ప్రకటన విడుదల చేశారు.

'హర్ హర్ మహాదేవ్'ప్రదర్శన నిలిపివేత.. మహారాష్ట్ర ఎన్‌సిపి ఎమ్మెల్యే అరెస్ట్

మాజీ ప్రధానికి మిగిలిన హంతకులను విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పు అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో భారత స్ఫూర్తికి అనుగుణంగా సుప్రీంకోర్టు వ్యవహరించకపోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్షమించరానిదిగా పరిగణిస్తుందని తెలిపారు.

జమ్మూ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీం.. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆదేశం

1991, మే 21వ తేదీ రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళా ఆత్మాహుతి బాంబర్ రాజీవ్ గాంధీని హత్య చేసింది. ఈ కేసుకు సంబంధించి 19 ఏళ్ల వయసులో పెరరివాలన్ అరెస్టయ్యాడు. 1998లో పేరారివాలన్‌కు యాంటీ టెర్రరిజం కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి ఏడాది సుప్రీంకోర్టు ఆ శిక్షను సమర్థించింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపిన బెల్ట్ బాంబును ప్రేరేపించడానికి ఉపయోగించిన 8-వోల్ట్ బ్యాటరీని కొనుగోలు చేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి.

అలాగే ఈ కేసులో పెరారివాలన్ తో పాటు నళిని, రవిచంద్రన్, సంతాన్, మురుగన్,  రాబర్ట్ పాయస్, జయకుమార్ లకు కోర్టు జీవిత ఖైదు విధించింది.  2001లో నళినీ శ్రీహరన్‌కు ఒక కుమార్తె ఉన్నందున ఆమె మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. 2014లో పెరరివాన్, మరో ఇద్దరు మురుగన్, సంతన్  (ఇద్దరూ శ్రీలంక వాసులు) క్షమాభిక్ష పిటిషన్‌లు సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్నందున దోషుల మరణశిక్షను.. జీవిత ఖైదుగా మార్చారు.  అయితే  తమిళనాడు ప్రభుత్వం 2018లో ఈ కేసులో పెరారివాలన్‌తో పాటు మరో ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలని రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అయితే వాటిని గవర్నర్.. రాష్ట్రపతికి దానిని పంపించారు. ఇక, పెరరివాలన్‌‌కు ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మేలో పెరరివాలన్‌ ను విడుదల చేయాలని ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?