జమ్మూ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీం.. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆదేశం

Published : Nov 11, 2022, 03:39 PM IST
జమ్మూ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీం.. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆదేశం

సారాంశం

గత రెండ్లేండ్ల కిత్రం జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో నకిలీ దగ్గు మందు కారణంగా పదిమంది పిల్లలు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలన్న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో నకిలీ దగ్గు మందు వల్ల పది మంది పిల్లలు మరణించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు (ఒక్కొక్కరికి) మూడు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)నిర్ణయానికి వ్యతిరేకంగా జమ్మూ,కాశ్మీర్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ ఎంఎం సుందరేష్ మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి మాకు ఎలాంటి కారణం కనిపించడం లేదని అన్నారు.

" అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారు అప్రమత్తంగా ఉండాలి. ఆహార శాఖ గురించి చెప్పమని మమ్మల్ని బలవంతం చేయవద్దు.   వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. పౌరుల జీవితాలతో ఆడుకోలేం. తనిఖీ చేయడం, ధృవీకరించడం వారి బాధ్యత." అని ధర్మాసనం పేర్కొంది. న్యాయస్థానం జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాన్ని బాధ్యులను చేసింది

మార్చి 3, 2021 నాటి సుప్రీం కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ జమ్మూ మరియు కాశ్మీర్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఇది NHRC ఉత్తర్వుకు వ్యతిరేకంగా తన అభ్యర్థనను కొట్టివేసింది. ఉధంపూర్‌లోని రామ్‌నగర్ తహసీల్‌లో నకిలీ దగ్గు సిరప్ తాగి డిసెంబర్ 2019 నుంచి జనవరి 2020 మధ్య కాలంలో పదిమంది పిల్లలు మరణించారు.

ఈ కేసులో డ్రగ్స్ డిపార్ట్‌మెంట్‌లో విధానపరమైన లోపాలను ఎన్ హెచ్ఆర్సీగుర్తించింది. డిపార్ట్‌మెంట్ లోపానికి జమ్మూ కాశ్మీర్ పరిపాలన పరోక్షంగా బాధ్యత వహిస్తూ..మృతుల తదుపరి బంధువులకు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసింది.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu