"అన్ని కులాల వారూ అర్హులే.." : అర్చకుల నియామకంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

Published : Aug 23, 2023, 01:07 PM IST
"అన్ని కులాల వారూ అర్హులే.." : అర్చకుల నియామకంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

సారాంశం

Supreme Court: అర్చకుల నియమకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులేనంటూ కీలక తీర్పునిచ్చింది. ఆలయ ఆగమ నిబంధనలను అనుసరిచే వారెరైనా అర్చకులుగా ఉండవచ్చన్న తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 

Supreme Court: అర్చకుల నియమకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులేనంటూ పేర్కొంది. ఆలయ ఆగమ నిబంధనలను అనుసరిచే వారెరైనా అర్చకులుగా ఉండవచ్చు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరుణంలో తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సేలం సుఖవనేశ్వరర్ ఆలయంలో పూజారి నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 2018లో ఆలయ నిర్వాహకులు నోటిఫికేషన్ జారీ చేశారు.

దీనిపై అక్కడ పనిచేస్తున్న ముత్తు సుబ్రమణ్యం గురుకులం మద్రాసు హైకోర్టులో కేసు వేసింది. అందులో సుగణేశ్వరాలయం ఆగమానికి ఆధారమని, ఈ నోటీసులో పేర్కొన్న విశేషాలు ఆగమానికి ఆధారం కాదని పిటిషన్ లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్.. ఆలయ ఆగమ, పూజా విధానాల్లో ప్రావీణ్యం ఉన్న వారెవరైనా అర్చకులుగా నియమించవచ్చని తీర్పునిచ్చారు. 

ఈ తీర్పునే మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది. ఈ తీర్పుపై ముత్తు సుబ్రమణ్య గురుస్‌ తరఫున అప్పీల్‌ దాఖలు చేయగా.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ముత్తు సుబ్రమణ్య గురువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ న్యాయమూర్తులు ఎంఎం సుందరేశ్వర్‌, పరిదివాలాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు మద్రాసు హైకోర్టు నిర్ణయాన్ని నిలిపివేసేందుకు నిరాకరించారు. ఆలయ ఆగమ నియమాల ప్రకారం ఉత్తీర్ణత సాధించినా ఏ కులం వారైనా పూజారి కావచ్చని పేర్కొంటూ అప్పీల్‌ను తోసిపుచ్చారు. అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చన్న మద్రాసు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి నిరాకరించింది.

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu