త్రిసభ్య ధర్మాసనానికి ‘ఉచితాలు’ కేసు.. రిఫర్ చేసిన సుప్రీంకోర్టు

Published : Aug 26, 2022, 12:54 PM IST
త్రిసభ్య ధర్మాసనానికి ‘ఉచితాలు’ కేసు..  రిఫర్ చేసిన సుప్రీంకోర్టు

సారాంశం

ఉచిత పథకాల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిలువరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. 

రాజకీయ పార్టీలు ఉచిత వస్తువులను పంపిణీ చేయడంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ గా ఉన్న జ‌స్టిస్ ఎన్ వీ ర‌మ‌ణ నేడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ముందుగా ఆయ‌న విచారించిన ఓ కేసును మొట్టమొద‌టి సారిగా సుప్రీంకోర్టు లైవ్ టెలీకాస్ట్ చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఈ ఉచిత పథకాల కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. అయితే దీనిపై దీనిపై నాలుగు వారాల తర్వాత విచారణ జరగనుంది.

కాంగ్రెస్ కు గులాం నబీ ఆజాద్ షాక్: ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాలకు హామీలు ఇవ్వ‌కుండా చూసేలా భారత ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌లు హిమా కోహ్లీ, సీటీ రవికుమార్‌లతో కూడిన సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది. రాజకీయ పార్టీల ఉచిత పంపిణీకి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి చర్చ అవసరమని బుధవారం బెంచ్ పునరుద్ఘాటించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై చర్చించడానికి అన్ని పార్టీల సమావేశాలకు ఎందుకు పిల‌వ‌డం లేద‌ని కేంద్రాన్ని ప్రశ్నించింది. 

ఒక హామీ సంక్షేమ ప‌థ‌క‌మా ? ఉచిత ప‌థ‌క‌మా అని నిర్ణయించాల్సిన అవసరం ఉందని మంగళవారం కోర్టు పేర్కొంది. బార్బర్‌కు షేవింగ్ కిట్, విద్యార్థికి సైకిల్, కల్లు కొట్టేవారికి పరికరాలు, బ‌ట్ట‌లు ఉతికే వారికి ఐరన్ బాక్స్ ఇవ్వ‌డం వ‌ల్ల వారి జీవనశైలిని మార్చేందుకు, వారిని పైకి తీసుకురావానికి చేసేవి అవుతాయ‌ని ఉదాహరణగా బెంచ్ పేర్కొంది. అయితే ఇవి పట్ట‌ణ జ‌నాభాకు ఉచితాలుగా  అనిపించ‌వ‌చ్చ‌ని వ్యాఖ్యానించింది. 

ఉచితాల్లో రాజకీయ పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయని, ఉచితాలు కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని నొక్కిచెప్పిన రమణ, ఉచితాల సమస్యను పరిష్కరించడానికి సూచనలు ఇవ్వడానికి వివిధ వాటాదారులతో కూడిన తటస్థ సంస్థను ఏర్పాటు చేయాలని అభిప్రాయ‌ప‌డుతున్నాని అన్నారు. 

పార్లమెంటేరియన్ హోదాలో బెంచ్ ఆహ్వానించిన సంస్థ ఏర్పాటు చేయ‌డానికి ముందు విస్తృత చ‌ర్య అవ‌స‌రం అని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఫైనాన్స్‌ కమిషన్‌ సమస్యను కూడా పరిశీలించాలని సూచించారు. SG తుషార్ మెహతా మాట్లాడుతూ.. ‘‘ మీరు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే విధంగా ఫైనాన్సింగ్ చేస్తుంటే, దానికి ఎలా అనుమ‌తి వ‌స్తుంది ’’ అని ౠయ‌న అన్నారు. రాజకీయ పార్టీలు ఉచితాలు పంపిణీ చేయ‌డం వ‌వ‌ల్ల ఓటరు సమాచార ఎంపికపై ప్రభావం చూపే వాతావరణం ఏర్పడిందని మెహతా చెప్పారు. 

రూ.30వేల కోసం.. మాజీ లవర్ ను కిడ్నాప్ చేయించిన ప్రియురాలు.. ఎక్కడంటే..

ఉచితాల పంపిణీ అసమాన ఆట తీరును సృష్టించిందని పేర్కొంటూ, ఉపాధ్యాయ్ తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ అన్నారు. ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకోవడంపై ఆయ‌న ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితాలను అందించడానికి నిధులు ఎక్కడి నుండి వినియోగిస్తున్నారో పార్టీలు వెల్లడించాలని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ మాట్లాడుతూ.. ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు కోర్టు ముందస్తుగా సన్నాహాలు చేయరాదని అన్నారు. 

కాగా.. డీఎంకే వంటి రాజకీయ పార్టీలు ఉచిత బహుమతుల పంపిణీ సమస్యను పరిష్కరించే సమయంలో సుబ్రమణ్యం బాలాజీ వర్సెస్ మద్రాస్ స్టేట్‌లో 2013లో SC ఇచ్చిన తీర్పును సమీక్షించాలని భారత ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ కోరారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?