నేటినుంచి ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు..

By SumaBala BukkaFirst Published Jan 26, 2023, 9:29 AM IST
Highlights

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం భారతీయ భాషల్లో 1,000కు పైగా తీర్పులను సుప్రీంకోర్టు విడుదల చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ బుధవారం ప్రకటించారు. 

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ బుధవారం నాడు భారతీయ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచే సేవలను ప్రారంభించారు.  గణతంత్ర దినోత్సవం నుంచి  ఈ సేవలో అందుబాటులో ఉంటాయి. దానికి కొన్ని షెడ్యూల్డ్ భాషలలో తీర్పుల అనువాదప్రతులు సిద్ధంగా ఉంచామని సీజేఐ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ-ఎస్సిఆర్…ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్టుల ప్రాజెక్టు  జనవరి 26 గురువారం నుంచి మొదలవుతుందని తెలిపారు. 

ప్రజలు, న్యాయ విద్యార్థులు, న్యాయవాదులు ఈ ప్రతులను ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులను దేశంలోని గుర్తించిన అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా కృషి కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ-ఎస్సిఆర్ ప్రాజెక్టులో భాగంగా సర్వోన్నత న్యాయస్థానానికి  సంబంధించిన వెబ్సైట్ తో ఇప్పుడు దాదాపు 34 వేల తీర్పులు ఉన్నాయని తెలిపారు.

ఏ  తీర్పుకు సంబంధించిన విషయం తెలుసుకోవాలంటే..  దానికి సంబంధించిన  విషయాన్ని సెర్చ్ ఇంజిన్ లో టైప్ చేయాలని..  అప్పుడు దానికి సంబంధించిన జడ్జిమెంట్ ప్రతులు ఇంగ్లీషులో వస్తాయని చెప్పారు. ఆ తీర్పులతోపాటు అది ఏ ఏ భాషల్లోకి అనువాదమయ్యాయో కూడా పక్కన లిస్ట్ చూపిస్తుందని అన్నారు.  అందులో తమకి ఇష్టమైన భాషను సెలెక్ట్ చేసుకుని తీర్పులను చదువుకోవచ్చు అని తెలిపారు.

స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు ఐక్యంగా ముందుకు సాగాలి.. ప్రధాని మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

ఈ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఇకపై నిరంతరం  కొనసాగుతుందని తెలిపారు. అనువాదప్రతులను కక్షిదారుల సౌకర్యార్థం క్రమం  తప్పకుండా తప్పకుండా అప్లోడ్ చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చెప్పుకొచ్చింది. దీని మీద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందిస్తూ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషలలో కూడా చదువుకునే వీలు కల్పించే ప్రయత్నం అభినందనీయమని అన్నారు.  తద్వారా గ్రామ- పట్టణాల మధ్య ఉన్న తేడాను భర్తీ చేయచ్చని..  ఆ దిశగా ఇదొక గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు.

స్కూల్లో స్థానిక పరిపాలన న్యాయవ్యవస్థలో భారతీయ భాషలను  వాడాలని.. అలా వాడేలా ప్రోత్సహించాలని తాను మొదటి నుంచి చెబుతున్నానని.. ఆ మేరకు కోరుతూ వస్తున్నానని గుర్తు చేశారు. ఇప్పుడు సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ దిశగా భారతీయ భాషల్లో తీర్పులు వెలువరించనున్నట్లు ప్రకటించడం స్వాగతిస్తున్నానని చెప్పారు. 

click me!