మోడీపై డాక్యుమెంటరీ: బీబీసీపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీం

Published : Feb 10, 2023, 01:42 PM ISTUpdated : Feb 10, 2023, 02:14 PM IST
మోడీపై  డాక్యుమెంటరీ:   బీబీసీపై నిషేధం కోరుతూ  దాఖలైన పిటిషన్ కొట్టేసిన  సుప్రీం

సారాంశం

ప్రధానమంత్రి మోడీపై వివాదాస్పద  డాక్యుమెంటరీని  ప్రసారం చేసినందుకు గాను  బీబీసీపై  ఇండియాలో నిషేధం  విధించాలని  దాఖలైన పిటిషన్ ను   సుప్రీంకోర్టు కొట్టివేసింది.  


న్యూఢిల్లీ: వివాదాస్పద  డాక్యుమెంటరీని  ప్రసారం చేసినందుకు  గాను  బీబీసీపై  నిషేధం విధించాలని  దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు  కొట్టి వేసింది.  ఇండియా-ది మోడీ క్వశ్చన్  పేరిట  బీబీసీ  డాక్యుమెంటరీ  వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.  సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను మెరిట్ లేని అభ్యర్ధనగా  పేర్కొంది.  

హిందూసేన  ఈ పిటిషన్ ను దాఖలు  చేసింది. పిటిషనర్ తరపున పింకీ ఆనంద్ వాదనలు విన్పించారు. అయితే  పూర్తి సెన్సార్ షిప్ పెట్టాలని  మీరు కోరుకుంటున్నారని  పిటిషనర్ తరపు న్యాయవాదిని  ధర్మాసనం ప్రశ్నించింది.  ఈ పిటిషన్  ను కోర్టు తప్పుబట్టింది.

హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా  ఈ పిటిషన్ ను దాఖలు  చేశారు.  భారత దేశానికి, భారత ప్రభుత్వానికి  వ్యతిరేకంగా బీబీసీ వ్యవహరిస్తుందని  పిటిషనర్ ఆరోపించారు.   బీబీసీ రూపొందించిన  డాక్యుమెంటరీ  మోడీకి వ్యతిరేకంగా  ఉద్దేశించిబడిందని  ఆయన ఆరోపించారు. 

2002 లో గుజరాత్ లో  జరిగిన అల్లర్లకు  సంబంధించి  బీబీసీ రూపొందించిన  డాక్యుమెంటరీ  వివాదాస్పదంగా మారింది.  మోడీ ప్రతిస్టను దిగజార్చే ఉద్దేశ్యంతో  ఈ డాక్యుమెంటరీని రూపొందించారని   పిటిషనర్ ఆరోపించారు.  

  ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది.  ఈ డాక్యుమెంటరీని సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాల్లో  నిషేధం విధిస్తూ  కేంద్రం ఆదేశాలు జారీచేసింది. దీంతో  విపక్షాలు కేంద్రం తీరుపైవిపక్షాలు మండిపడ్డాయి.ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ  దేశంలోని పలు రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో  ఈ డాక్యుమెంటరీని  ప్రదర్శించిన విషయం తెలిసిందే . ఈ సందర్భంగా కేసులు కూడా నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?