లాలూకు షాక్: బెయిల్ కుదరదన్న సుప్రీం

By Siva KodatiFirst Published Apr 10, 2019, 2:05 PM IST
Highlights

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. 

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. 1990లలో బీహార్‌లో చోటు చేసుకున్న దాణా కుంభకోణానికి సంబంధించి పలు కేసుల్లో దోషిగా తేలిన లాలూ.. రాంచీలోని బిర్సా ముందా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

బెయిల్ కోసం ఈ ఏడాది జనవరి 10న జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడంతో లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా అత్యున్నత న్యాయస్థానంలో సైతం లాలూకు చుక్కెదురైంది. 

click me!