మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ద విమానాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

Published : Jan 28, 2023, 11:39 AM ISTUpdated : Jan 28, 2023, 12:03 PM IST
మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ద విమానాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

సారాంశం

భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ద విమానాలు మధ్యప్రదేశ్‌లో కుప్పకులాయి. కుప్పకూలిన వాటిలో సుఖోయ్-30, మిరాజ్ 2000 యుద్ద విమానాలు ఉన్నాయి.

భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ద విమానాలు మధ్యప్రదేశ్‌లో కుప్పకులాయి. కుప్పకూలిన వాటిలో సుఖోయ్-30, మిరాజ్ 2000 యుద్ద విమానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాల అక్కడికి చేరుకున్నాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు  కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రెండు విమానాలు శిక్షణ, విన్యాసాల కోసం బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో అవి ఒకదానికొకటి ఢీకొని కూలిపోయాయి.

శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. సుఖోయ్-30 నుంచి పైలట్‌లు సురక్షితంగా బయటపడ్డారని.. వారికి స్వల్ప గాయాలయ్యాయని  వారు తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu