బాలికలు హిజాబ్ ధరించి స్కూల్ కు రావడాన్ని సమర్థించిన విద్యార్థి.. చితకబాదిన రైట్ వింగ్ గ్రూప్.. త్రిపురలో ఘటన

Published : Aug 05, 2023, 02:46 PM IST
బాలికలు హిజాబ్ ధరించి స్కూల్ కు రావడాన్ని సమర్థించిన విద్యార్థి.. చితకబాదిన రైట్ వింగ్ గ్రూప్.. త్రిపురలో ఘటన

సారాంశం

త్రిపురలో హిజాబ్ వివాదంతో ఉద్రిక్తత నెలకొంది. బాలికలు హిజాబ్ ధరించి పాఠశాలకు రావడాన్ని ఓ వర్గం సభ్యులు వ్యతిరేకించగా.. మరో విద్యార్థి దానిని సమర్థించాడు. దీంతో ఆ విద్యార్థిని మరో వర్గానికి చెందిన సభ్యులు చితకబాదారు. సెపాహిజాలా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

బాలికలు హిజాబ్ ధరించడం విషయంలో మొదలైన గొడవ త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసింది. ముస్లిం వర్గానికి చెందిన పలువురు బాలికలు హిజాబ్ ధరించి పాఠశాలకు వెళ్లడాన్ని రైట్ వింగ్ గ్రూప్ వ్యతిరేకించింది. దీనిని ఓ విద్యార్థి నిరసించాడు. పలువురి విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగాడు. దీంతో అతడిని ఆ గ్రూపు సభ్యులు చితకబాదారు.

జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్ పై 5.2 తీవ్రత నమోదు..

‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం.. సెపాహిజాలా జిల్లాలోని బిషల్‌ఘర్ సబ్‌డివిజన్‌ లోని ఓ స్కూల్ కు వారం రోజుల కిందట ఓ రైట్ వింగ్ సంస్థతో సంబంధం కలిగి ఉన్న, అదే పాఠశాలలో గతంలో చదివిన విద్యార్థుల బృందం వచ్చింది. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను పాఠశాల ఆవరణలోకి అనుమతించకూడదని ఆందోళన చేసింది. అనంతరం ప్రధానోపాధ్యాయుడిని కూడా ఈ విషయంలో అభ్యర్థించింది. ప్రభుత్వం నిర్దేశించిన యూనిఫారాన్ని ధరించడం లేదని, హిజాబ్ పై నిషేధం అమలు చేయాలని ఆ బృందం కోరింది.

అయితే ఈ నిబంధనపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో పాఠశాలలో హిజాబ్ ధరించరాదని ప్రధానోపాధ్యాయుడు ప్రియతోష్ నంది ముస్లిం బాలికలకు మౌఖికంగా తెలియజేశారు. అయితే దీనిని ఆ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థి వ్యతిరేకించాడు. మరి కొందరు విద్యార్థులతో కలిసి ప్రధానోపాధ్యాయుడి గదిని ధ్వంసం చేశాడని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.

మణిపూర్ లో మళ్లీ హింస.. ముగ్గురిని కాల్చి చంపిన దుండగులు..

ఈ విషయం తెలియడంతో రైట్ వింగ్ గ్రూపు సభ్యులు పాఠశాల బయట ఆ విద్యార్థి కోసం ఎదురు చూడసాగారు. హిజాబ్ ధరించడాన్ని సమర్థించిన ఆ విద్యార్థి బయటకు వచ్చిన వెంటనే చితకబాదారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసు బలగాలు మోహరించాయి. ముందు జాగ్రత్త చర్యగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ పాఠశాల తరగతులను నిలిపివేశారు. 

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి సానియా వివరాలు తొలగించిన షోయబ్‌ మాలిక్.. మళ్లీ మొదలైన విడాకుల ఊహాగానాలు..

అయితే ఇది మతపరమైన సమస్య కాదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ట్వీట్ చేశారు. రాష్ట్ర అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని, సమస్యను పరిష్కరించడానికి, ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu