
బాలికలు హిజాబ్ ధరించడం విషయంలో మొదలైన గొడవ త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసింది. ముస్లిం వర్గానికి చెందిన పలువురు బాలికలు హిజాబ్ ధరించి పాఠశాలకు వెళ్లడాన్ని రైట్ వింగ్ గ్రూప్ వ్యతిరేకించింది. దీనిని ఓ విద్యార్థి నిరసించాడు. పలువురి విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగాడు. దీంతో అతడిని ఆ గ్రూపు సభ్యులు చితకబాదారు.
జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్ పై 5.2 తీవ్రత నమోదు..
‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం.. సెపాహిజాలా జిల్లాలోని బిషల్ఘర్ సబ్డివిజన్ లోని ఓ స్కూల్ కు వారం రోజుల కిందట ఓ రైట్ వింగ్ సంస్థతో సంబంధం కలిగి ఉన్న, అదే పాఠశాలలో గతంలో చదివిన విద్యార్థుల బృందం వచ్చింది. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను పాఠశాల ఆవరణలోకి అనుమతించకూడదని ఆందోళన చేసింది. అనంతరం ప్రధానోపాధ్యాయుడిని కూడా ఈ విషయంలో అభ్యర్థించింది. ప్రభుత్వం నిర్దేశించిన యూనిఫారాన్ని ధరించడం లేదని, హిజాబ్ పై నిషేధం అమలు చేయాలని ఆ బృందం కోరింది.
అయితే ఈ నిబంధనపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో పాఠశాలలో హిజాబ్ ధరించరాదని ప్రధానోపాధ్యాయుడు ప్రియతోష్ నంది ముస్లిం బాలికలకు మౌఖికంగా తెలియజేశారు. అయితే దీనిని ఆ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థి వ్యతిరేకించాడు. మరి కొందరు విద్యార్థులతో కలిసి ప్రధానోపాధ్యాయుడి గదిని ధ్వంసం చేశాడని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.
మణిపూర్ లో మళ్లీ హింస.. ముగ్గురిని కాల్చి చంపిన దుండగులు..
ఈ విషయం తెలియడంతో రైట్ వింగ్ గ్రూపు సభ్యులు పాఠశాల బయట ఆ విద్యార్థి కోసం ఎదురు చూడసాగారు. హిజాబ్ ధరించడాన్ని సమర్థించిన ఆ విద్యార్థి బయటకు వచ్చిన వెంటనే చితకబాదారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసు బలగాలు మోహరించాయి. ముందు జాగ్రత్త చర్యగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ పాఠశాల తరగతులను నిలిపివేశారు.
ఇన్స్టాగ్రామ్ నుంచి సానియా వివరాలు తొలగించిన షోయబ్ మాలిక్.. మళ్లీ మొదలైన విడాకుల ఊహాగానాలు..
అయితే ఇది మతపరమైన సమస్య కాదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ట్వీట్ చేశారు. రాష్ట్ర అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని, సమస్యను పరిష్కరించడానికి, ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.