చెన్నై విమానాశ్రయంలో బిగ్ షాక్: మహిళ లగేజీలో పాముల కుప్ప

Published : Apr 30, 2023, 08:59 AM ISTUpdated : Apr 30, 2023, 09:24 AM IST
చెన్నై విమానాశ్రయంలో బిగ్ షాక్: మహిళ లగేజీలో పాముల కుప్ప

సారాంశం

చెన్నై ఇంటర్ నేషల్ ఎయిర్ పోర్ట్ లో పాముల కలకలం చేలారేగింది. మలేషియా నుంచి వచ్చిన ప్రయాణికురాలి బ్యాగులో వివిధ జాతులకు చెందిన 22 పాములు లభ్యమయ్యాయి. 

చెన్నై ఇంటర్ నేషల్ ఎయిర్ పోర్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ విచిత్ర ఘటనకు ఈ విమానాశ్రయం వేదిక అయ్యింది. ఓ మహిళా ప్రయాణీకురాలి బ్యాగ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న వివిధ జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికురాలు శుక్రవారం మలేషియా నుంచి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.  ఆ వీడియో ఓ అధికారి పొడవాటి రాడ్‌ని ఉపయోగించి పామును బయటకు తీస్తున్నట్లు చూడవచ్చు. కొందరు నేలపై ఉన్న డబ్బాల నుండి బయటకు తీశారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన మహిళను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై చెన్నై కస్టమ్స్ అధికారులు ట్వీట్  చేస్తూ..  "28.04.23న, కౌలాలంపూర్ నుండి ఫ్లైట్ నంబర్ AK13లో వచ్చిన ఓ మహిళను కస్టమ్స్ అడ్డగించింది. ఆమె సామాను తనిఖీ చేసి చూడగా..  అందులో  22 వివిధ జాతుల పాములు,ఒక ఊసరవెల్లి కనుగొనబడ్డాయి. వాటిని  స్వాధీనం చేసుకుని.. 1962 r/w వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద కేసు ఫైల్ చేశాం" అని ట్వీట్ చేసింది.


అంతకుముందు జనవరిలో ఇలాంటి సంఘటనలో జరిగింది. 45 బాల్ కొండచిలువలు, మూడు మార్మోసెట్‌లు, మూడు నక్షత్రాల తాబేళ్లు, ఎనిమిది కార్న్ స్నేక్స్ లను  చెన్నై విమానాశ్రయంలోని కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

\

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?