కరోనాతో దేశవ్యాప్తంగా ఒకేరోజు ఆరుగురు మృతి... ఢిల్లీలో JN.1 మొదటి కేసు...

Published : Dec 29, 2023, 06:43 AM IST
కరోనాతో దేశవ్యాప్తంగా ఒకేరోజు ఆరుగురు మృతి... ఢిల్లీలో JN.1 మొదటి కేసు...

సారాంశం

ఢిల్లీలో JN.1 కరోనావైరస్ సబ్-వేరియంట్ మొదటి కేసు నమోదైందని నగర ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. JN.1 అనేది ఓమిక్రాన్ వేరియంట్  సబ్ వేరియంట్, యునైటెడ్ స్టేట్స్‌లో బాగా వ్యాప్తిలో ఉంది. అక్కడ 44 శాతం కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి.

ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ కలకలం రేపుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది.  ఈ క్రమంలోనే గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి ఆరు గుర్రం మృతి చెందారు.  మొత్తంగా ఒక్కరోజే 702  కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న క్రియాశీలక కేసుల సంఖ్య 4097 కు చేరుకుంది. ఈ గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో కరోనాతో ఇద్దరు మృతిచెందగా కేరళ,  పశ్చిమబెంగాల్,  కర్ణాటక,  ఢిల్లీలలో  ఒక్కొక్కరు మృతి చెందారు.

మొత్తంగా గురువారం ఒక్కరోజే ఆరుగురు కరోనాతో మృతి చెందారు. కాగా ఇప్పటివరకు 22వ తేదీ అత్యధికంగా ఒకేరోజు 752 కేసులు నమోదైనట్లుగా తెలిపింది.  ఈ కరోనా వైరస్ సోకిన వారిలో జెఎన్1 సబ్ foరియంట్ నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 157కు చేరుకున్నట్లుగా ఇన్సాకాగ్ గురువారం తెలిపింది.  గత నెలతో పోలిస్తే ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. నవంబర్లో 16 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ నెల మొదలయ్యాక 141 కేసులను గుర్తించారు. ఈ కేసుల్లో కూడా కేరళలోనే అత్యధికంగా 78 కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత 34 కేసులతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది..

Rahul Gandhi: రాహుల్ గాంధీకి తప్పిన పెను ప్రమాదం.. వెంటనే విమానం దారి మళ్లింపు.. అసలేం జరిగిందంటే?

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 702 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదవడంతో, కోవిడ్ -19 కేసులలో ఇటీవలి పెరుగుదల గురువారం కూడా కొనసాగింది. దీంతో దేశంలో యాక్టివ్‌ కాసేలోడ్‌ 4,097గా ఉంది. 2020 జనవరిలో కరోనావైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి, ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,50,10,944కి చేరుకుంది. భారత్‌లో మొత్తం మరణాల సంఖ్య 5,33,346కి చేరింది. 

బుధవారం, ఢిల్లీలో JN.1 కరోనావైరస్ సబ్-వేరియంట్ మొదటి కేసు నమోదైందని నగర ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. JN.1 అనేది ఓమిక్రాన్ వేరియంట్  సబ్ వేరియంట్, యునైటెడ్ స్టేట్స్‌లో బాగా వ్యాప్తిలో ఉంది. అక్కడ 44 శాతం కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి.

భారత్ లో, JN.1 రూపాంతరం అనేక రాష్ట్రాలలో కనుగొనబడింది, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు డిసెంబర్ 26 నాటికి మొత్తం 109 కేసులను నివేదించాయి. గుజరాత్, కర్ణాటకలలో వరుసగా 36, 34 కేసులు నమోదయ్యాయి, తరువాతి స్థానంలో గోవా, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి.

JN.1 ఎక్కువగా వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రాథమికంగా సాధారణ జలుబు వంటి తేలికపాటి లక్షణాలతో మొదలవుతుంది. ఎగువ శ్వాసనాళాన్ని ప్రభావితం చేస్తుందని తెలుపుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kerala Flight Disruptions Due to Israel-Iran Conflict: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం | Asianet News Telugu
Why Did Protests Erupt in India Over Iran’s Supreme Leader Ali Khamenei? | Asianet News Telugu