Rahul Gandhi: రాహుల్ గాంధీకి తప్పిన పెను ప్రమాదం.. వెంటనే విమానం దారి మళ్లింపు.. అసలేం జరిగిందంటే? 

By Rajesh KarampooriFirst Published Dec 29, 2023, 5:41 AM IST
Highlights

Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నాగ్‌పూర్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని జైపూర్‌కు మళ్లించాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన ఆ పార్టీ మెగా ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమం ముగించుకుని సాయంత్రం రాహుల్ గాంధీ విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతున్నట్లు సమాచారం.

Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నాగ్‌పూర్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని జైపూర్‌కు మళ్లించాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన ఆ పార్టీ మెగా ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమం ముగించుకుని సాయంత్రం రాహుల్ గాంధీ విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతున్నట్లు సమాచారం. అయితే.. పొగమంచు కారణంగా.. విమానాశ్రయంలో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారి ఆదేశాల మేరకు  విమానాన్ని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారు.  

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. దీని ప్రభావం ట్రాఫిక్‌పై ఎక్కువగా కనిపిస్తోంది. 

మరోవైపు.. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ మరో విమానంలో గురువారం అర్థరాత్రి నాగ్‌పూర్ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఖుర్షీద్.. నాగ్‌పూర్‌లో మెగా ర్యాలీ జరిగింది. మేము సిద్ధంగా ఉన్నామని నాగ్‌పూర్ నుండి ఈ సందేశం ఇచ్చాము. ఈడీ చార్జిషీట్‌లో ప్రియాంక గాంధీ పేరును నిందితురాలిగా చేర్చలేదని ఆయన చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీ గత కొన్నిరోజులుగా దట్టమైన పొగమంచు సమస్య ఎదుర్కొంటోంది. వాతావరణ శాఖ ప్రకారం.. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో చాలా దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో గురువారం రాత్రి 11:30 గంటలకు తేలికపాటి నుండి మోస్తరు పొగమంచు కనిపించింది. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది

వార్తా సంస్థ PTI ప్రకారం.. దట్టమైన పొగమంచు కారణంగా గురువారం (డిసెంబర్ 28) మూడవ రోజు ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో దాదాపు 60 విమానాలు దారి మళ్లించబడ్డాయి. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. డిసెంబరు 25వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి డిసెంబర్ 28వ తేదీ ఉదయం 6 గంటల వరకు వాతావరణం అనుకూలించకపోవడంతో మొత్తం 58 విమానాలు, ఎక్కువగా దేశీయ విమానాలను దారి మళ్లించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. తక్కువ దృశ్యమాన పరిస్థితులలో విమానాలను నడపడానికి పైలట్‌లకు శిక్షణ ఇవ్వనందున చాలా విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో కనీసం 13 ఇండిగో విమానాలను దారి మళ్లించగా, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్‌లకు చెందిన 10 విమానాలు దారి మళ్లించబడ్డాయి. అదే సమయంలో విస్తారాకు చెందిన 5 విమానాలు, ఆకాస ఎయిర్‌కు చెందిన 3 విమానాలు, అలయన్స్ ఎయిర్‌కు చెందిన 2 విమానాలను దారి మళ్లించారు.ఢిల్లీ విమానాశ్రయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఫాగ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ , టేకాఫ్ ఆలస్యమవుతున్నట్టు తెలిపింది.
 

click me!