మంత్రిగారి రాసలీలల కేసు.. పోలీసుల ఆధీనంలో యువతి ప్రియుడు

By telugu news teamFirst Published Mar 16, 2021, 7:35 AM IST
Highlights

మంత్రిగారితో ఉన్న సమయంలో సీడీ రికార్డ్ చేస్తున్నారన్న విషయం ఆమెకు స్పష్టంగా తెలుసని.. తర్వాత డబ్బు గుంజుదామనే ఆలోచనతోనే ఆమె అలా చేసిందని ప్రియుడు ఆకాష్ సిట్ అధికారులకు వివరించాడు.

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా.. పోలీసులు ఆ వీడియోలో మంత్రితోపాటు ఉన్న యువతి గురించి వెతుకుతుండగా... ఆమె ప్రియుడి ఆచూకీ లభించింది.

తాను సదరు యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానని.. అయితే.. ఆ యువతి తనను దారుణంగా మోసం చేసిందని అతను చెప్పడం గమనార్హం. మంత్రిగారితో ఉన్న సమయంలో సీడీ రికార్డ్ చేస్తున్నారన్న విషయం ఆమెకు స్పష్టంగా తెలుసని.. తర్వాత డబ్బు గుంజుదామనే ఆలోచనతోనే ఆమె అలా చేసిందని ప్రియుడు ఆకాష్ సిట్ అధికారులకు వివరించాడు.

సీడీ కేసు విచారిస్తున్న సిట్‌ పోలీసులు ఆమెకు ఆకాష్‌ అనే ప్రియుడు ఉన్నాడని గుర్తించి విచారణకు పిలిచారు. ఇక యువతి, ఆమె బృందం కదలికల ఆధారాల కోసం 70 సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. అతని ద్వారా ఆమె ఎక్కడెక్కడ సంచరించిందీ తెలుసుకున్నారు. ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాల చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తద్వారా కీలక సాక్ష్యాలు లభించినట్లు తెలిసింది. సీడీ  విడుదల కాకముందు ఆకాష్‌ కొందరు పాత్రికేయులను కలిసిన దృశ్యాలు లభించాయి.  

click me!