భారత ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన సింగపూర్.. ఈ నెల 26 నుంచి అమల్లోకి..

Published : Oct 23, 2021, 06:19 PM ISTUpdated : Oct 23, 2021, 07:51 PM IST
భారత ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన సింగపూర్.. ఈ నెల 26 నుంచి అమల్లోకి..

సారాంశం

భారత ప్రయాణికులపై విధించిన కఠిన నిబంధనలను సడలిస్తున్నట్టు సింగపూర్ ప్రకటించింది. ఈ దేశం నుంచి ప్రయాణికులను దేశంలోకి అనుమతిస్తామని, అయితే, తమ దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత పది రోజుల క్వారంటైన్ మాత్రం కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని వివరించింది. మంగళవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. భారత్‌తోపాటు మరో ఐదు దేశాలకు ఈ సడలింపులు వర్తించనున్నాయి.  

న్యూఢిల్లీ: Indiaలో coronavirus పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొంత స్థిరత్వాన్ని సాధిస్తుండటంతో Singapore కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను ఈ నెల 26వ తేదీ నుంచి దేశంలోకి అనుమతిస్తామని వెల్లడించింది. భారత్‌తోపాటు బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల నుంచి ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతిస్తామని సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు.

అయితే, ఈ ఆరు దేశాల నుంచి వచ్చే వారు సింగపూర్‌లో అడుగుపెట్టగానే కచ్చితంగా పది రోజులు Quarantine పూర్తి చేయాలని ఓ మెలిక పెట్టారు. నిర్దేశిత సదుపాయంలో వారు ఈ పది రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని ఆ ప్రకటన పేర్కొంది.

Also Read: బ్యాకాంక్ ట్రిప్ కి ఇక గ్రీన్ సిగ్నల్..!

ఈ ఆరు దేశాలపై విధించిన ఆంక్షలను ఇటీవలే సమీక్షించామని ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ వివరించారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆరు దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించలేమని తెలిపారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయని, అందుకే నిబంధనలు సడలిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ దేశాల్లో కొంత స్థిరత్వం ఏర్పడిందని వివరించారు. కాబట్టి, వాటిపై కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. మంగళవారం నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని తెలిపారు. మలేషియా, ఇండోనేషియా దేశం నుంచి వచ్చే ప్రయాణికులపైనా ఆంక్షలు సడలిస్తున్నట్టు పేర్కొన్నారు.

శుక్రవారం నాటికి ఈ దేశంలో మొత్తం 1,65,663 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా కారణంగా ఈ దేశంలో 294 మంది మరణించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పల్లెటూరిలో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు.. దేశంలో తొలిసారి అంతర్జాతీయ కార్డియాక్ కాన్ఫరెన్స్
మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi visits Melbourne Cricket Ground