సిక్కింలో విషాదం.. హిమపాతంలో చిక్కుకున్న పర్యాటకులు.. ఆరుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు..

Published : Apr 04, 2023, 04:20 PM ISTUpdated : Apr 04, 2023, 04:42 PM IST
 సిక్కింలో విషాదం.. హిమపాతంలో చిక్కుకున్న పర్యాటకులు.. ఆరుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు..

సారాంశం

సిక్కింలోని నాథు లాలో భారీ హిమపాతం సంభవించింది, ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు మరణించారు. చాలా మంది ప్రజలు చిక్కుకున్నారని భయాందోళన చెందుతున్నారు.  

సిక్కిం హిమపాతం: సిక్కింలోని నాథు లా వద్ద సరిహద్దు ప్రాంతంలో మంగళవారం భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో 6 మంది పర్యాటకులు మరణించగా, 11 మంది గాయపడ్డారు. దాదాపు 80 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.

ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంచులో చిక్కుకున్న 22 మంది పర్యాటకులను రక్షించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హిమపాతం సంభవించింది. ప్రస్తుతం సిక్కిం పోలీసులు, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ సిక్కిం, టూరిజం శాఖ అధికారులు, వాహన డ్రైవర్లు సహాయక చర్యలు చేపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?