'ఇది బీజేపీ కుట్ర': ఆ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సంజయ్ రౌత్ ఫైర్  

Published : Apr 04, 2023, 03:50 PM IST
'ఇది బీజేపీ కుట్ర': ఆ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సంజయ్ రౌత్ ఫైర్  

సారాంశం

బీహార్,పశ్చిమ బెంగాల్‌లో జరిగిన  హింసాత్మక సంఘటనలపై శివసేన (యుబిటి)నాయకుడు సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ అల్లర్ల వెనుకు బీజేపీ ఉందనీ, ఇది బీజేపీ కుట్ర అని బిజెపిపై తీవ్ర స్థాయిలో దాడి చేసారు.

రామనవమి సందర్భంగా బీహార్, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ఈ ఘర్షణల వెనుక భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉందని, ఇది ముమ్మాటికి బీజేపీ కుట్రనేనని అన్నారు. కాషాయ పార్టీ బలహీనంగా ఉన్న చోట అల్లర్లు జరుగుతున్నాయని, 2024లో ఓడిపోయే చోట అల్లర్లు జరుగుతున్నాయని సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. సంజయ్ రౌత్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..“ఇది ప్రభుత్వం ప్రాయోజిత హింస. ఇది భారతీయ జనతా పార్టీ (బిజెపి) కుట్ర, ఇది కేంద్రం చేసిన కుట్ర. 2024లో బీజేపీ ఎక్కడ బలహీనంగా ఉందో? ఎక్కడ బీజేపీ ఓడిపోతుందో? అక్కడ ఈ అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు. 

అమిత్ షాపై సంజయ్ రౌత్ ఫైర్ 
 
కేంద్ర మంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ సంజయ్ రౌత్ ఇలా మాట్లాడుతూ..'బిహార్‌లో నితీష్ కుమార్,  తేజస్వి యాదవ్ మధ్య పొత్తు బలమైన పొత్తు ఉందనీ, ఈ పొత్తును చూసి బిజెపి భయపడుతోందనీ అన్నారు. అలాగే.. పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ కూడా బీజేపీకి గట్టిపోటీ ఇస్తుందనీ అన్నారు. ఇటు మహారాష్ట్రలో శివసేన (యుబిటి)తో కలిసి ఉన్న మహావికాస్ అఘాడితో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటుందని అన్నారు. కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో అధికార బీజేపీ అల్లర్లు చేస్తుందని అన్నారు.   

ఆదివారం బీహార్‌లో జరిగిన ర్యాలీలో  బిజెపి అధికారంలోకి వస్తే అల్లర్లను తలక్రిందులుగా వేలాడదీస్తానని ప్రతిజ్ఞ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కూడా సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. రామనవమి ఊరేగింపుల సందర్భంగా బీహార్‌లోని ససారం,బీహార్ షరీఫ్, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ ,హౌరా జిల్లాల్లో హింస చెలరేగాయని సంజయ్ రౌత్ వెల్లడించారు. 

హనుమాన్ జయంతి సందర్భంగా హింస.. భయపడుతున్న మమతా

హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం రాష్ట్రంలో మరో దఫా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అగ్రనేత కూడా ఆయుధాలు , బాంబులు పట్టుకుని రాజకీయ కార్యకర్తలు హింసను ప్రేరేపించడానికి పండుగ ముగిసిన ఐదు రోజుల తర్వాత కూడా మైనారిటీ ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపులను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని అన్నారు. హుగ్లీ జిల్లాలోని రిష్రా , సెరాంపూర్‌లో రామనవమి ఊరేగింపుల సందర్భంగా రెండు వర్గాల ప్రజల మధ్య ఘర్షణలు చెలరేగిన ఒక రోజు తర్వాత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఏప్రిల్ 6 (హనుమాన్ జయంతి) నాడు మైనారిటీలను హింసించకుండా చూసే బాధ్యతను నా హిందూ సోదరులకు అప్పగిస్తానని పుర్బా మేదినీపూర్ జిల్లాలో జరిగిన  కార్యక్రమంలో మమతా ఆందోళన వ్యక్తం చేశారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu