నన్ను బరిలో నుంచి త‌ప్పించ‌డానికి రాహుల్‌పై ఒత్తిడి.. శ‌శి థ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : Oct 05, 2022, 02:35 AM IST
నన్ను బరిలో నుంచి త‌ప్పించ‌డానికి రాహుల్‌పై ఒత్తిడి..  శ‌శి థ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సారాంశం

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవలసిందిగా తనకు నచ్చచెప్పాలని పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరినట్లు తిరువనంతపురం ఎంపి, పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రోజుకో కొత్త రగడ తెర మీదికి వ‌స్తుంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి బ‌రిలో ఉన్న ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు శశి థరూర్ సంచ‌ల‌న  వ్యాఖ్య‌లు చేశారు. తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునే విధంగా చేయాల‌ని. ఈ మేర‌కు  పలువురు పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీపై ఒత్తిడి తీసుకవ‌చ్చార‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

ఎన్నికల ప్రచారంలో మంగ‌ళ‌వారం ఆయ‌న కేరళలో నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. అనంత‌రం.. శశి థరూర్ విలేకరులతో మాట్లాడుతూ.. అతి పురాతన పార్టీ ఎన్నికల్లో లాభపడుతుందని, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవలసిందిగా తనకు నచ్చచెప్పాలని పార్టీ నాయకులు కొందరు  పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు  రాహుల్ గాంధీని కోరినట్లు తెలిపారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం.. తాను థరూర్‌ను నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని తాను కోరబోనని స్పష్టం చేశారని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ ఉండాల్సిందేనని గత పదేళ్లుగా చెబుతున్నానని గుర్తు చేశారు.

 త‌న అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కొందరు తనను కోరారని రాహుల్ గాంధీ కూడా నాతో చెప్పారని తిరువనంతపురం ఎంపీ అన్నారు. అలా చేయనని, తాను  వెనక్కి తగ్గనని, ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిపారు. 

అంతకుముందు రోజు మాట్లాడుతూ పెద్ద నాయకులు తనకు మద్దతు ఇస్తారని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఇంత ఆద‌ర‌ణ‌ ఊహించలేదని అన్నారు. అదే సమయంలో ఇత‌ర నేత‌ల  మద్దతు అవసరమ‌ని అన్నారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు కె సుధాకరన్ పార్టీ చీఫ్ పదవికి సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించిన తరువాత శ‌శి థ‌రూర్ ఈ ప్రకటన చేశారు. 

తాను ఎన్నికల నుంచి వైదొలగి.. ఇప్పటివరకు తన ప్రయత్నానికి మద్దతుగా నిలిచిన వారికి ద్రోహం చేయబోనని శశిథరూర్ అన్నారు. పార్టీలోని పెద్ద నాయకుల నుంచి ఎలాంటి సహకారం ఆశించడం లేదని అన్నారు. తాను నాగ్‌పూర్, వార్ధా, ఆ తర్వాత హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తలను కలిశాననీ, అధ్యక్ష పదవికి పోటీ చేయమని అడిగే వారు కానీ ఇప్పుడు వెనక్కి తగ్గరనీ, కానీ తాను  వెనక్కి తగ్గబోనని హామీ ఇచ్చానని చెప్పారు. ఇప్పటి వరకు త‌న‌కు మద్దతుగా నిలిచిన వారికి ద్రోహం చేయననీ, త‌న‌పై వారికి ఉన్న నమ్మకాన్ని కోల్పోలేన‌ని స్పష్టం చేశారు.    

ప్రజల మనసులో ఏముందో చెప్పలేం

తన మద్దతుదారులలో ఎక్కువ మంది పార్టీ యువనేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారని, త‌న‌కు అంద‌రీ  మద్దతు అవసరమ‌ని, అన్నారు.  మల్లికార్జున్ ఖర్గేకు సుధాకరన్ బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఇతరులకు మద్దతు ఇవ్వకుండా నిరుత్సాహపరిచేందుకు ఉద్దేశించబడిందా? అని అడిగిన ప్రశ్నకు, శశి థరూర్ బదులిస్తూ.. ఉండవచ్చు, కానీ, తాను అలా చెప్పడం లేదు. ప్రజల మనసులో ఏముందో అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. ఒక్కటి చెబుతాను. ఎన్నికల గురించి ఎవరూ రహస్యంగా లేదా బహిరంగంగా ఏమీ చెప్పరు, కానీ బ్యాలెట్ రహస్యంగా ఉంటుంది. అని అన్నారు.   

ఎన్నికల సమయంలో ఎవరు ఎవరికి ఓటు వేశారో ఎవరికీ తెలియదని, ప్రజలు వారి కోరికలు, నమ్మకం ప్రకారం ఓటు వేయవచ్చననీ,  పార్టీని ఎవరిని బలోపేతం చేయాలనేది త‌న నిర్ణ‌యమ‌నీ, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం ఉన్నానని అన్నారు.  

ఎన్నికల ప్రచారంపై పార్టీ ఆఫీస్ బేరర్లకు సర్క్యులర్ 

పార్టీ కార్యకర్తలు అభ్యర్థుల కోసం ప్రచారం చేయకుండా పార్టీ జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేనని, అయితే దయచేసి దాని గురించి త‌న‌ని అడగవద్దని ఆయన అన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ సోమవారం జారీ చేసిన ఎన్నికల సర్క్యులర్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి/ఇన్‌చార్జ్, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ), అధినేత ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు, డిపార్ట్‌మెంట్‌లు హెడ్, సెల్ మరియు అన్ని అధికారిక ప్రతినిధులు అభ్యర్థులకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు.

ఇదిలా ఉంటే..  కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న పోలింగ్ జరగనుంది. అక్టోబరు 19న ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నిక‌ల్లో  9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ప్రతినిధులు ఓటు వేయనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu