అదుపుతప్పి తుంగభద్ర కాలువలో పడిపోయిన ఆటో.. ముగ్గురు మృతి, మరో ముగ్గురు గల్లంతు

By Sumanth KanukulaFirst Published Sep 14, 2022, 1:56 PM IST
Highlights

కర్ణాటకలోని బళ్లారి  తాలుకా కొలగల్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొలం పనుల కోసం కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి తుంగభద్ర కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.

కర్ణాటకలోని బళ్లారి  తాలుకా కొలగల్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొలం పనుల కోసం కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి తుంగభద్ర కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఒక్కరు ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ముగ్గురు కాలువలో గల్లంతయ్యారు. కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 11 మంది ఉన్నట్టుగా చెబుతున్నారు. 

ఈ ప్రమాదంపై కర్ణాటక మంత్రి బి శ్రీరాములు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాలువలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తుంగభద్ర కాలువ పొంగిపొర్లడంతో  సహాయక చర్యలకు స్వల్ప ఆటంకం ఏర్పడిందని చెప్పారు. అయితే ఆ తర్వాత గల్లంతైన వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన వారికి తగిన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. నీటిలో గల్లంతైనవారు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. 

click me!