గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్లో నిర్మాణంలో ఉన్న భవనంలోని లిఫ్ట్ కుప్పకూలడంతో 8 మంది మృతిచెందారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్లో నిర్మాణంలో ఉన్న భవనంలోని లిఫ్ట్ కుప్పకూలడంతో 8 మంది మృతిచెందారు. మృతులంతా కూలీలుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్లో ఎంతమంది ఉన్నారనే తెలియాల్సి ఉంది. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇక, గుజరాత్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ప్రాథమిక విచారణలో కార్మికులను తీసుకెళ్తున్న లిఫ్ట్ ఏడో అంతస్థు నుంచి కుప్పకూలింది. ఎనిమిది మంది కార్మికులు మరణించారు’’ అని జోన్ 1 డిప్యూటీ పోలీస్ కమిషనర్ లవీనా సిన్హా తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.